క్రికెట్ ప్రపంచంలో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ వేరు. ఇటు ఇండియన్ ఫ్యాన్స్ అటూ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు టిక్కెట్ల కోసం ఎగబడతారు. టీ20 వరల్డ్ కప్లో ఈ నెల 24న ఇండియా-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు ఎప్పుడో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా ఈ మ్యాచ్ను రద్దు చేయాలని, ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని, ‘బ్యాన్ పాక్ క్రికెట్’ అంటూ ట్విటర్లో కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ నిరసన తెలుపుతున్నారు. #ban_pak_cricket అనే హ్యాష్ ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
భారత్లో ఉగ్ర చర్యలను ప్రోత్సహించే పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ ఆడటం సరైంది కాదనేది వీరి వాదన. కాగా మరో వైపు ఆటకు బార్డర్ సమస్యలకు ముడిపెట్టొదని.. పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఆడి పాక్ను చిత్తుచిత్తుగా ఓడించాలని మరికొంత మంది వాదిస్తున్నారు. బార్డర్లో ధీటుగా బదులు ఇచ్చినట్లే మ్యాచ్లో గెలిచి పాక్కు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది సరైందో? పాక్తో ఇండియా మ్యాచ్ ఆడాలా? వద్ద? అనే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Completely boycott pak cricket#ban_pak_cricket pic.twitter.com/vNqpZGeB3j
— Ajit Soni (@Ajit_Soni_) October 17, 2021
I am true cricket fan पर देश पहले #Ban_Pak_Cricket @shubhankrmishra pic.twitter.com/2a5NL5d6cT
— Prakhar Sahu🇮🇳 (@itzprakhar) October 17, 2021