న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0తో గెలిచింది. ఈ గెలుపులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్ట్లో మొత్తం 8 వికెట్లు తీసుకుని.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అశ్విన్ చాలా సంతృప్తిగా ఉన్నాడు. కాగా సిరీస్ ముగింపు సందర్భంగా జరిగిన టోర్నీ ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన అశ్విన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘బహుశా ఇది నా పదో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయిఉంటుంది, వాంఖడేలో బౌలింగ్ చేయడాన్ని ఆనందించానని’ అన్నాడు.
దీంతో పాటు త్వరలో జరగబోయే సౌతాఫ్రికా టూర్ గురించి కూడా స్పందించాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తూ సౌతాఫ్రికాతో మ్యాచ్లలో కూడా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ నిపుణులను ఆలోచింపజేస్తున్నాయి. దీనికి కారణం.. జట్టులో అశ్విన్ ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం ఈ మధ్య కాలంలో చోటు దక్కడం లేదు. ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్లో కూడా జడేజాకు విశ్రాంతి ఇవ్వడంతోనే అశ్విన్ తుది జట్టులో ఉన్నాడు. అంతకు ముందు ఇంగ్లండ్తో సిరీస్లోనూ, న్యూజిలాండ్తో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి తనపై నమ్మకం లేకనే తుది జట్టులో స్థానం కల్పించడం లేదని అశ్విన భావిస్తున్నట్లు అర్థం అవుతుంది.
The 372-run victory is #TeamIndia‘s biggest victory by runs in Test cricket! #INDvNZ pic.twitter.com/Kfrpb1zv3i
— BCCI (@BCCI) December 6, 2021
ఇప్పడు టీమిండియా కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్కు అశ్విన్పై పూర్తి విశ్వాసం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే కోహ్లీని ఎలాగైనా ఒప్పించి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో తుది జట్టులో స్థానం కల్పిస్తాడనే నమ్మకంతోనే అశ్విన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడేజా తిరిగి జట్టులోకి వస్తే అశ్విన్కు చోటు దక్కడం అనుమానమే. అందుకే ఈ ఫామ్ను చూపిస్తూ.. సౌతాఫ్రికాతో టూర్లో కూడా తనకు స్థానం కల్పించాల్సిందే అనే సంకేతాలు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. నిజానికి అశ్విన్కు రావాల్సిన అవకాశాలు సరిగా రాలేదనే చెప్పాలి.
CHAMPIONS 👏👏
This is #TeamIndia‘s 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8
— BCCI (@BCCI) December 6, 2021
టెస్ట్లో టీమిండియా మేటి బౌలర్లలో ఒకడైన అశ్విన్కు చాలా సార్లు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ అనే కారణంతో అతని స్థానంలో జడేజాకు అనేక సార్లు అవకాశం కల్పించారు. అలాగే విదేశాల్లో స్పిడ్, బౌన్స్ పిచ్లు ఎదురైనప్పుడు కూడా అశ్విన్కు టీమ్లో ప్లేస్ దక్కలేదు. కానీ అశ్విన్లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. మరి అశ్విన్ మాటలను కెప్టెన్ కోహ్లీ పరిగణంలోకి తీసుకుని.. సౌతాఫ్రికాతో టెస్ట్లలో అవకాశం ఇస్తాడో.. లేక ప్రతిసారిలాగే బెంచ్కు పరిమితం చేస్తాడో చూడాలి.
A series win over the world champs ! Feels great to win a test at the Wankhede always. 👌👌A fab innings by @mayankcricket and great bowling performance by @AjazP . A special thanks to the @NorthStandGang for their support through the game 👏👏 pic.twitter.com/NbgJZUnwHz
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 6, 2021