ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఏపీ రాజకీయాలు మాత్రం ఇప్పటినుంచే హాట్ హాట్గా మారాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల పంచాయతీ నడుస్తోంది. మరోవైపు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిస్తున్నారు. కొన్ని రోజుల్లో ఆయన రాష్ట్రమంతా పర్యటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాక.. ఎమ్యెల్యేల పని తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వే.. చేయించి.. గ్రాఫ్ పడిపోయిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే..ఏడుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లేవని సీఎం జగన్ నేరుగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. వీరిలో ఇద్దరు తాజా మాజీ మంత్రులు ఉండటం కూడా కలకలం రేపుతోంది.
వివాదాస్పద శైలితో వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు గండం
వివాదాస్పద ప్రకటనలతో హోరెత్తించే ఓ మాజీ మంత్రికి వచ్చే ఎన్నికల్లో చాన్స్ లేదని జగన్ నేరుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఓ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కీలక బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి.. పార్టీని గెలిపించి మంత్రిని అవుతానని ఆయన అంటున్నారు. కానీ టిక్కెట్టే ఇవ్వడం లేదని సంకేతాలు అందడంతో ఆయన చుట్టూ ఉన్న నేతలు కూడా జారుకుంటున్నారు. కోస్తా జిల్లాలో వివాదాస్పద ప్రకటనలకు పెట్టింది పేరైన మరో ఎమ్మెల్యే.. వరుసగా గెలుస్తూ వస్తున్న మరో ఎమ్మెల్యేకూ సీటు లేదని హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: MLC Ramachandraiah: జగన్ పథకాలపై సొంత పార్టీ నేతల విమర్శలు.. ఎమ్మెల్సీ రామచంద్రయ్య వ్యాఖ్యలపై రచ్చ!
ఆ రాజధాని ఎమ్మెల్యేకూ కష్టమే
ఇక రాజధాని ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం వినిపిస్తోంది. అత్యంత కీలకమైన నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన పనితీరు నాసిరకంగా ఉండటంతో సీటిచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా ఒకరికి ఈ మేరకు టిక్కెట్ లేదనే కన్ఫర్మేషన్ అందినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలో కీలక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యేకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. మరో ఎమ్మెల్యే ఎవరన్నది క్లారిటీ రాలేదు.
ఇది కూడా చదవండి: Sonia Gandhi And Rahul Gandhi: సోనియా, రాహుల్ లకు ED నోటీసులు! జగన్ జోలికి వస్తే.. తిప్పలు తప్పవా?
ఇద్దరు మాజీ మంత్రులకూ నో టిక్కెట్స్
మొత్తంగా ఇప్పటి వరకూ ఏడుగురు ఎమ్మెల్యేలకు జగన్ ఇలా ఈ సారి పార్టీ కోసం పని చేయాలని.. పోటీకి ప్రయత్నించవద్దని ముందుగానే చెప్పినట్లయింది. ఇలా చెప్పడానికి కారణాలు ఉన్నాయని.. గ్రాఫ్ పడిపోతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంటుందని చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Chengala Venkat Rao: వంగలపూడి అనితకు వైసీపీ నేత చెంగళ వెంకట్రావ్ ఒపెన్ సవాల్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు రెడీనా!