వైసీపీ తిరుగబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాక అధిష్టానానికి సవాల్ కూడా విసిరారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని.. ఆలోపు తనపై అనర్హత వేటు వేయకపోతే.. తానే రాజీనామా చేస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి : పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల బూతుపురాణం.. రఘురామ సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడారు. ‘‘మా పార్టీ వాళ్లు త్వరలోనే నాపై అనర్హత వేటు వేయాలని.. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఎంత వరకు విజయం సాధిస్తారో చూద్దాం. నాకు చట్టం తెలుసు. మా పార్టీ నేతలను చూసి నాకే జాలి కల్గుతుంది. అందుకే నేను రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. ప్రజలు మా పార్గీని ఎంత అసహ్యించుకుంటున్నారో నిరూపిద్దామని నాకు ఓ ఆలోచన వచ్చింది. త్వరలోనే నాపై అనర్హత వేటు వేస్తారని తెలిసి.. నేనే రాజీనామా చేయాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఆగి రాజీనామా చేయాలో చెప్పండి.. అన్ని రోజులు ఆగుతాను అన్నాను. నా చాలెంజ్ కు వాళ్ల నుంచి స్పందన రాలేదు. మరో వారం రోజులు సమయం ఇస్తున్నాను. ఈ లోపు వాళ్లు నిర్ణయం తీసుకోకపోతే.. నేనే నా నిర్ణయం చెబుతాను. త్వరలోనే రాజీనామా చేస్తాను’’ అని తెలిపారు. రఘురామ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : రఘురామ బెయిలా.. జైలా, సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ