మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ, రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక ప్రస్థానం. సినిమాల్లో మెగాస్టార్గా రాణించి అశేష ప్రేక్షకాదరణ సపందించుకున్నారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. అయితే అది అనుకున్న మేర విజయంవంతం కాలేదు. ఆ తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. రాజ్యసభకు వెళ్లారు. తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మెగా బ్రదర్ కూడా ప్రస్తుతం జనసేలోనే ఉన్నారు. ఈ క్రమంలో తరచుగా ఓ వార్త వినిపిస్తుంది. చిరంజీవి జనసేనలో చేరతారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. జనసేన పార్టీలోకి చిరంజీవి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
జనసేన ఫ్యామిలీ సభ్యులను చూడడానికి, వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పెంచి వాళ్లలో ఉత్సాహం నింపడానికే ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టానని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యడు నాగబాబు అన్నారు. గురువారం విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. విజయనగరంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో కూర్చొని ఎవరో చెప్పింది తెలుసుకునే కంటే నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానన్నారు. ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థానంలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందని తెలిపారు. కార్యకర్తలలో మంచి జోస్ ఉందని, నియోజకవర్గం సమస్యల చాలా లేవనెత్తారని, నాయకులలో చిన్న చిన్న విభేదాలు కూడా ఉండటం వాస్తవేమనన్నారు.
ఇది కూడా చదవండి: Mukku Avinash: నా కొడకా ఇంకోసారి అలా చేస్తే.. ముక్కు అవినాష్ కు నాగబాబు వార్నింగ్!
చిరంజీవి మద్దతు జనసేనకే..
చిరంజీవికి పార్టీలోకి వచ్చే ఆలోచన ఉంటే ఇప్పటకే వచ్చేవారన్నారు. కానీ ఆయన సినిమాలకే మొగ్గు చూపుతున్నారని కళామాతల్లి సేవలోనే ఉంటారన్నారు. కానీ ఆయన మద్దతు మాత్రం జనసేనకే ఉంటుందన్నారు. ఏపీలో ఉన్న హెరిటేజ్ అండ్ కల్చర్ని పూర్తిగా దెబ్బకొట్టారని నాగబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇక ఉత్తరాంధ్రలో విస్తారంగా ఖనిజ సంపద ఉందని వాటిని చాలా మంది దోచుకుంటున్నారని నాగబాబు మండిపడ్డారు. ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదని ఖనిజ సంపద కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో వలసలు ఇంకా కొనసాగుతున్నాయని, ఉత్తరాంధ్ర ప్రజల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని ఆయన అన్నారు. దానిని ఎలా మార్చాలో అన్నది ఆయనకు తెలుసని తెలిపారు. నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.