ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. మంత్రి వర్గవిస్తరణ తర్వాత జగన్ టీమ్లోకి కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. అయితే రెండో దఫాలో మంత్రులైన వారంతా ఎంతో సంతోషంగా గవర్నర్, సీఎం జగన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కాగా నూతన మంత్రులుగా ఎన్నికైన వారంతా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: భగ్గుమన్న బాలినేని! మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు!
ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే..? మంత్రి విస్తరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన వారు కాస్త షాక్ గురయ్యారు. ఇక ఇంతటితో ఆగకుండా నేడు అట్టహాసంగా నిర్వహించిన ప్రమాణస్వీకారానికి ఐదుగురు మాజీ మంత్రులు డుమ్మా కొట్టడం విశేషం. ఇందులో ముఖ్యంగా మేకపాటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలీనేని, ఆళ్లనానీ, శ్రీరంగనాథరాజులు హాజరు కాలేదు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి డుమ్మాకొట్టిన మాజీ మంత్రుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.