సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రుతీ హాసన్ నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్ఫూర్తిగా తీసుకుని.. చాలా మంది కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. చాలా మంది ఎన్నారైలు తమ స్వగ్రామాంంలో మంచి పనులు చేపట్టారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తెలంగాణ, నిజామాబాద్లో చోటు చేసుకుంది. ఓ ఎన్నారై స్వగ్రామం మీద ప్రేమతో 7 కోట్ల రూపాయలతో అనాథాశ్రమం ప్రారంభించాడు. విషయం తెలిసిన స్థానికులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీధర్, సుచిత్ర దంపతులు.. గ్రామ శివారులో నాలుగు ఎకరాల స్థలంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో 300 మంది అనాథ బాలలకు సకల వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఆశ్రమాన్ని (నిర్మించారు. శ్రీధర్ ప్రస్తుతం అమెరికాలోని కార్పోర్నియలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. ఆయన భార్య సుచిత్ర కూడా ఇంజనీర్. శ్రీధర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే దురదృష్టం కొద్ది కుమారుడు ఐదేళ్ల వయసులోనే మృతి చెందాడు. ఈ క్రమంలో కుమారుడి జ్ఞాపకార్థం.. గుమ్మడి ఫౌండేషన్ ద్వారా అనాథ ఆశ్రమాన్ని నిర్మించామన్నారు దంపతులు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఎంపిక చేసిన అనాథ బాలలకు ఆశ్రమంలో ఉచిత ఆశ్రయం కల్పిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Bithiri Sathi: పక్కా కమర్షియల్ టీమ్ పై బిత్తిరి సత్తి అసహనం.. వీడియో వైరల్!
ఈ ఆశ్రమం కోసం శ్రీథర్ దంపతులు సుమారు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో అనాధ ఆశ్రమాన్ని నెలకొల్పారు. అన్ని సదుపాయాలతో దాదాపు 320 మంది బాలలకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ అనాథ ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 15న నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి లతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. శ్రీధర్ మంచి మనసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 10th Exams: పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రికొడుకు.. తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్!