ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన ప్రవచనాలు వీడియోలు తాజాగా మరోసారి వైరల్ కావడం.. అవి వివాదాలకు దారి తీయడం జరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆసియాలో రెండో కుంభమేళాగా భావించే మేడారం జాతర, వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ఉద్దేశిస్తూ చిన జీయర్ చేసిన ప్రవచనాల వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి రావడమే కాక వైరల్గా మారింది.
ఈ వీడియోలో చినజీయర్ స్వామి.. ‘‘వాళ్లేం దేవతలా.. బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా.. ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత… గ్రామదేవత… అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు… ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు… అది వ్యాపారమైపోయింది ఇప్పుడు… ఎంత అన్యాయం. అది ఒక చెడు… కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో’’ అంటూ ఆ వీడియోలో వన దేవుతల్ని కించ పరిచేలా మాట్లాడారు.
ఇది కూడా చదవండి: మేడారం జాతరలో ఎమ్మెల్యే సీతక్క మాస్ ఫాలోయింగ్!
అయితే చినజీయర్ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితం ఓ ఎంటర్టైన్మెంట్ చానల్లో ఆయన చేసిన ప్రసంగాల వీడియో. అప్పట్లో రోజువారీగా ఆయన ప్రవచనాలు సదరు చానెల్లో ప్రసారమయ్యేవి. అయితే అప్పట్లో జీయర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వీడియో వైరల్ కావడంతో చినజీయర్ పై సమ్మక్క-సారలమ్మ భక్తులు భగ్గుమంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం చిన్న జీయర్ స్వామిపై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: రోజా ఇంట్లో భోజనం, జగన్ తో కౌగిలింతలు.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
వన దేవతలైన సమ్మక్క-సారల్మలను ఉద్దేశించి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఖండించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ సీతక్క ఆగ్రహించారు. ‘‘మా తల్లులది వ్యాపారమా.. లేక.. సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మీరు చేస్తున్నదని వ్యాపారమా’’ అని నిలదీశారు. తమ దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని చెప్పారు. అదే.. 120 కిలోల బంగారంల గల సమతామూర్తి విగ్రహం చూడటానికే మీరు రూ. 150 టికెట్ పెట్టారని విమర్శించారు. ఈ రెండింటినీ పోలుస్తూ ఎవరిది వ్యాపారం అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు ధ్యాంక్స్ చెప్పిన హీరో సూర్య
‘మీది బిజెనెస్.. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’ అంటూ సీతక్క మండిపడ్డారు. అంతేకాక చినజీయర్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, గిరిజనుల ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని రాజకీయంగా మెలిక పెట్టారు ఎమ్మెల్యే సీతక్క. మరి ఈ వివాదంపై చిన జీయర్ ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.