cm kcr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అస్వస్థత కారణంగా ఈ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డా.ఎంవీ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రెండు రోజులుగా వీక్గా ఉన్నారని అన్నారు. ఎడమ చెయ్యి లాగుతున్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజిగ్రామ్ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా! జనరల్ చెకప్లో భాగంగా అన్ని పరీక్షలు చేస్తామని చెప్పారు. సీఏం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి : యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.