తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ ఏదో సంచలన నిర్ణయం తీసుకుంటూ.. వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక ఉత్వర్వులు జారీ చేసి వార్తల్లో నిలిచారు సజ్జనార్. ఈ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. ముఖ్యంగా మహిళా సిబ్బంది.
ఆ వివరాలు.. మహిళా కండక్టర్లకు శుభవార్త చెప్పారు ఎండీ సజ్జనార్. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు ఇకపై రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని, రాత్రి 8 గంటల్లోపే వారు డిపోలకు చేరుకునేలా డ్యూటీ ఛార్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ సూచించారు.
ఇది కూడా చదవండి : అల్లు అర్జున్కు తలనొప్పిగా మారిన యాడ్! నోటీసులు పంపిన టీఎస్ ఆర్టీసీ
తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీ చేయాల్సి వస్తే ఆ కారణాన్ని హెడ్ ఆఫీస్కు తెలియజేయాలని సూచించారు. సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృతజ్ఞతలు తెలియజేసస్తున్నారు.
All the DM’s, DVM’s & RM’s
Please adhere Strictly. pic.twitter.com/joDxhog95p— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 23, 2021
ఇది కూడా చదవండి : ఆర్టీసీ బస్సులో సజ్జనార్ ఫ్యామిలీ.. కుటుంబంతో కలిసి డ్యాన్స్