వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయ వాతావారణం అప్పుడే హీటెక్కింది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో విజయం సాధించడం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. యూపీలో గెలుపు కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. వాటిలో భాగంగా గోవుల సంరక్షణ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గోవుల సంరక్షించడాన్ని బీజేపీ గర్వంగా భావిస్తే.. విపక్షాలు మాత్రం దాన్ని పెద్ద పాపంగా చూస్తున్నాయి అంటూ మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ గురువారం వారణాసిలోని డెయిరీ, విద్య, ఆరోగ్యానికి సంబంధించి రూ. 870 కోట్ల విలువ చేసే 22 అభివృద్ధి ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. అలానే వారణాసిలో బానాస్ డైరి సంకుల్ కి శంకుస్థాపన చేశారు.
ఇది కూడా చదవండి : టీకా సర్టిఫికేట్ పై ప్రధాని ఫొటో తొలగించాలంటూ పిటీషన్ వేసిన వ్యక్తికి షాక్!
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘గోవుల సంరక్షణ బీజేపీ దృష్టిలో గర్వించే అంశమైతే.. విపక్షాల దృష్టిలో మాత్రం అది పెద్ద పాప. గోవులు, గేదెల మీధ జోక్ లు వేస్తూ విపక్షాలు.. వాటి మీదనే ఆధారపడి బతుకున్న కోట్లాది జనాలను అవమానిస్తున్నారు’’ అని తెలిపారు. అంతేకాక ‘‘గత ఆరేడు సంవత్సరాలతో పోలిస్తే.. దేశంలో పాల ఉత్పత్తి 45 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పాలలో 22 శాతం భారత్ నుంచే లభిస్తోంది. యూపీ పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలవడమే కాక.. డైరీ సెక్టార్ ను విస్తరిస్తోంది. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను’’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి : మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం