ఐపీఎల్ 2022లో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. దాదాపు అసాధ్యం అనుకున్న గెలుపును రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా తమ సూపర్ హిట్టింగ్తో సాధించి చూపించారు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ ఖాన్, తెవాటియా రెచ్చిపోయారు. మార్కో జన్సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా లాంగ్ ఆన్లో సిక్సర్ బాదాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది. 3వ బంతికి రషీద్ క్రీజులోకి వచ్చాడు. ఆ బంతికి రషీద్ స్ట్రెయిట్ సిక్స్ బాదాడు.
4వ బంతికి పరుగులు ఏమీ రాలేదు. ఇక 2 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ మ్యాజిక్ చేశాడు. 5వ బంతికి మార్కో జన్సేన్ ఫుల్ టాస్ వేయగా.. దాన్ని ఆఫ్ సైడ్ సిక్సర్గా మలిచాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో షార్ట్ పిచ్ బంతి పడగా రషీద్ బ్యాట్కు ఎడ్జ్ అయ్యి బంతి నేరుగా బౌండరీ అవతల పడింది. దీంతో గుజరాత్ డగౌట్లో సంబరాలు మిన్నంటాయి.అదే సమయంలో సన్రైజర్స్ డగౌట్లో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీథరన్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పొందడంతో తట్టుకోలేకపోయాడు. కుర్చీలోంచి లేచి మరి గట్టిగా అరుస్తూ కనిపించారు. చివరి ఓవర్లో మార్కో జన్సేన్ 22 పరుగులు డిఫెండ్ చేయలేకపోవడం ఆయన ఆగ్రహానికి కారణం అయింది. ప్రస్తుతం ముత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎప్పుడూ కామ్ అండ్ కూల్గా ఉండే ముత్తయ్య.. బుధవారం మ్యాచ్ ఓటమితో సహనం కోల్పోయారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రియాన్ పరాగ్కు షేక్ హ్యాండ్ ఇవ్వని హర్షల్ పటేల్
Jansen nee #muttiahmuralitharan room loo vadiley ivala nyt ki pic.twitter.com/MmhUvO5eIg
— Akhil (@Akhil_182k1) April 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.