పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రెహమ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఆదివారం నా మేనల్లుడి వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు నా కారుపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో నా వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి : స్త్రీలు పొట్టి బట్టలు ధరిస్తే.. మగాళ్ల మనసు చలించదా?
‘ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ లో పిరికిపందలు, దుండగులు, అత్యాశపరులు పెరిగిపోయారు. దేశంలో ప్రజలకు భద్రత లేకుండా పోతుంది. కాల్పుల ఘటన నన్ను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇది కచ్చితంగా పిరికిపంద చర్యే’ అంటూ.. మాజీ భర్త ఇమ్రాన్ ను ఉద్దేశించి రెహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
On the way back from my nephew’s marriage my car just got fired at & two men on a motorbike held vehicle at gunpoint!! I had just changed vehicles.
My PS & driver were in the car. This is Imran Khan’s New Pakistan? Welcome to the state of cowards, thugs & the greedy!!— Reham Khan (@RehamKhan1) January 2, 2022
బ్రిటీష్-పాకిస్తాన్ మూలాలుకు చెందిన జర్నలిస్ట్, మాజీ టీవీ యాంకర్ అయిన రెహహ్ ఖాన్ను పాక్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015, అక్టోబర్ 30న వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి రెహమ్ ఖాన్ సందర్భం వచ్చిన ప్రతి సారి మాజీ భర్తపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. 2019 పుల్వామా దాడి తర్వాత.. ఇమ్రాన్ ఖాన్ దేశ సైన్యం చేతిలో కీలుబొమ్మ అని.. భావజాల, మితవాద విధానంపై రాజీపడి.. ఆయన అధికారంలోకి వచ్చారని రెహం ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ మాజీ భార్య రెహం ఖాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పాకిస్థాన్ ప్రధానితో రేఖ పెళ్లి.. పీటల వరకు వచ్చి ఎందుకు ఆగింది