దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ఆ దృశ్యాలను అతడి భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…
ఉత్తర్ ప్రదేశ్.. ఫైజ్ గంజ్ బెహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలిక నివసిస్తోంది. ఈ నెల 12 న బాధిత బాలికను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటికి రమ్మని పిలిచాడు. తెలిసిన వారే కదా.. ఏదైనా మాట్లాడుతారని భావించిన బాలిక ఇంటికి వెళ్లింది. ఆ వ్యక్తి బాలికను బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇందుకు అతని భార్య సహకరించడమే కాక.. సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించింది.
ఈ విషయం ఎక్కడైనా చెబితే.. రేప్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని ఆ దంపతులు బాలికను బెదిరించారు. కానీ దుర్మార్గులు ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయం బాధిత కుటుంబ సభ్యులకు తెలియడంతో.. ఆమెను వెంటపెట్టుకుని వెళ్లి సదరు దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై రేప్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గ్రామస్థులు ఆ దంపతులకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: పక్కింటి కుర్రాడితో లేచిపోయిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్!