నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలాంటి కుంపటిలో పడి కొందరు సొంత సంసారాలను కాదని పరాయి సంసారాలకే ఎక్కువ ప్రధాన్యతనిస్తున్నారు. ఇలా ఓ పక్కింటి సంసారాల్లో వెలు పెట్టిన ఓ వివాహిత నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిర్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని కవుంతక్కి ప్రాంతం. ప్రకాష్, సుజాత ఇద్దరు భార్యాభర్తలు.
కొంత కాలం వీరి కాపురం సాఫీగా సాగుతూ వచ్చింది. రోజులు గడిచే కొద్ది భార్య సుజాత ప్రవర్తనలో మార్పొచ్చి పక్కదారుల్లోకి వెళ్లింది. ఇక స్థానికంగా ఉండే వేలుసామి అనే 65 ఏళ్ల తో వృద్ధుడితో సుజాత వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. దీంతో కొంత కాలం ఎవరికి తెలియకుండా వీరి పక్కింటి కాపురం రంజుగానే సాగింది. అయితే ఇంతలోనే ప్రియురాలు సుజాత కాస్త రూటు మార్చింది. విషయం ఏంటంటే..? ప్రియుడు వేలుసామి సన్నిహితంగా ఉండడం, పైగా అతనికి భార్య లేకపోవడంతో ప్రియురాలు సుజాత బరితెగించి ప్రవర్తించింది.
ఆమె కోరిక మేరకు శారీరక కోరికలు తీర్చుకోవడం పైగా అతనిని డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగేది. అలా కొంత కాలం ప్రియురాలు అడిగిందని వేలుసామి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు. అలా ఇస్తున్న కొద్ది సుజాత బరితెగించి హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ డబ్బులు ఇవ్వకుంటే మన బండారం బయటపెడతానంటూ ప్రియుడికి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇటీవల లక్ష రూపాయలు అవసరముంది, అర్జెంట్ గా కావాలని చెప్పింది. ఖచ్చితంగా ఇవ్వాలంటూ బ్లాక్ ముయిల్ కు కూడా దిగింది ప్రియురాలు సుజాత. ఏం చేయాలో అర్థం కాని ప్రియుడు వేలుసామి ఇలాగైతే కాదని, సుజాతని హత్య చేయాల్సిందేనంటూ పథకం వేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపనిలో పనిగా డిసెంబర్ 19న వేలుసామి సుజాతను ఫోన్ చేసి తారాపురం రావాలని కబురు పంపాడు. అనుకున్నట్లుగానే వెళ్లిన ప్రియురాలికి వేలుసామి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ వేశాడు. అక్కడికి వెళ్లాక సుజాత ప్రియుడిని డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య కాస్త వివాదం రాజుకుంది. దీంతో ఇక భరించలేకపోయిన ప్రియుడు వేలుసామి సుజాత గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ప్రియురాలిని వివస్త్రను చేసి బట్టలను కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు. సుజాత ఫోన్ కాల్ ఆధారంగా వేలుసామి మాట్లాడినట్లు తేలడంతో అతనిని విచారించారు. పోలీసుల ఇన్వెస్ట్ గేషన్ లో భాగంగా ఎట్టకేలకు నిందితుడు వేలుసామి సుజాతను నేనే హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.