Secunderabad Railway Station: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడించారు. రైళ్లు, స్టాళ్లను తగలబెట్టి నానా భీభత్సం చేశారు. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి ప్రీ ప్లాన్గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఉద్యోగ ఆశావాహుల వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సికింద్రాబాద్లో నిరసనపై సమాచారం షేర్ చేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్లాన్తో సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారని తెలుస్తోంది. అగ్నిపథ్ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
ఆందోళన కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాల వారీగా వాళ్లంతా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసన కోసం గురువారం రాత్రే అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ బయట కాసేపు ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి, రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. రైల్వే స్టేషన్ లోపల పట్టాలపై బైఠాయించారు. ఆ తర్వాత ఫ్లాట్ఫామ్ మీద ఉన్న రైళ్లపై రాళ్ల దాడి చేశారు.
అనంతరం అక్కడ ఉన్న రైళ్లు, స్టాళ్లను తగలబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లోపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అదనపు బలగాలు వచ్చినప్పటికి ఆర్మీ అభ్యర్థులు తమ ఆందోళనను విమరించలేదు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మరి, సికింద్రాబాద్ అల్లర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లకల్లోలం.. రైళ్లు, స్టాళ్లు తగలబెట్టిన ఆర్మీ అభ్యర్థులు!!