Crime News : ప్రేమ.. నిర్వచనం లేని ఓ అనుభూతి.. ఎప్పుడు, ఎవ్వరిలో.. ఎవ్వరిపై.. ఎందుకు.. ఎలా.. ఏ టైంలో పుడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ ప్రేమ కూడా కొన్ని సమయాల్లోనే గౌరవంగా ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమిస్తే ఒకరకంగా.. పెళ్లి తర్వాత ప్రేమిస్తే మరోరకంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఇతరులపై కలిగే ప్రేమకు అర్థం మారిపోతుంది. ఆలుమగలను, ఇరు కుటుంబాలను కష్టాల పాలు చేస్తుంది. తాజాగా, పెళ్లైన 20 రోజుల్లోనే ఓ యువతి మరిదితో ప్రేమలో పడింది. మొగుడ్ని, ఇరు కుటుంబాలను కాదని, అతడితో లేచిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని పురాన్పూర్ కొత్తాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి పిలిభిత్కు చెందిన ఓ యువతితో 20 రోజుల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టింది. కొత్త కోడలు రాకతో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లివిరిసిశాయి.
భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, యువతి ఆలోచనలు ఇంకో రకంగా ఉన్నాయి. ఆమె పెళ్లైన మూడో రోజే మరిది వరసయ్యే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఆమె భర్తతో కంటే అతడితోనే క్లోజ్గా ఉండేది. ఇద్దరూ వదిన, మరదులు కావటంతో ఎవ్వరూ అనుమానించలేదు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఇంట్లోంచి లేచిపోయారు. పోతూపోతూ ఆమె ఇంట్లోని డబ్బు, బంగారు నగలు కూడా తీసుకుపోయింది. ఆమె కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యుల్లో అనుమానం మొదలైంది. లేచిపోయిన సంగతి తెలిసి షాక్ తిన్నారు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
చదవండి :తమ్ముడి ఫ్రెండ్తో అక్క సంబంధం.. కనిపించకుండా పోయిన తమ్ముడు.. 6 నెలల తర్వాత..
తమ్ముడికి పవర్ బ్యాంక్ తెస్తానని వెళ్లాడు.. రాత్రి ఇంటికి వస్తుండగా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.