పోలీసులు అంటే ప్రజలకు రక్షకులు. ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవతలి వ్యక్తిని పిలిపించి విచారణ జరిపి న్యాయ అన్యాయాలను పరిశీలించి ఎవరు వైపు న్యాయం ఉంటే న్యాయం జరిగేలా చేయాలి. కానీ కొందరు పోలీసులు అలా వచ్చిన వారికి అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోయి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తునారన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్సై సమీర్ బాషా. ప్రేమ పెళ్లికి సాయం చెయ్యమన్నందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. అప్పటికి రూ.10వేలు చెలించిన బాధితుడు ఆ ఎస్సై వేధింపు తట్టుకోలేకే అనిశా అధికారులకు సదరు ఎస్సైను పట్టించాడు. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా మద్దికెర కు చెందిన క్రాంతి కుమార్ ప్రీతిలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఒప్పుకున్న, అబ్బాయి తరపువారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లను ఒప్పించండి అంటూ క్రాంతి కుమార్ తో పాటు అమ్మాయి తరపు బంధువులు తుగ్గలి ఎస్సై సమీర్ బాషా వద్దకు వెళ్లారు. వారిని ఒప్పించడం పెద్ద పనేమికాదులే అని చెప్పుకొచ్చిన ఎస్సై ..ఖర్చులకు ఓ యాభైవేలు ఇవ్వండి అని అడిగాడు. ఎస్సై అప్పటికప్పుడు బాధితుల చేత రూ.10 ఫోన్ పే ద్వారా వేయిచుకున్నాడు. ఆ తరువాత కూడా అతని ద్వారా క్రాంతి, ప్రీతిల పెళ్లి జరగలేదు.
అంతే కాక మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని వారిని బెదిరించాడు. ఇదెక్కడి ఖర్మ అంటూ విసిగిపోయిన వరుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి ఎస్సై వేధింపుల గురించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలిపాడు. తుగ్గలి ఎస్సై లంచం తీసుకున్నట్లు పూర్తి స్థాయిలో పక్క ఆధారాలు లభించడంతో అతనిపై ఎప్పుడైన వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.