ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. అప్పు తీసుకున్న పాపానికి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా బెదిరింపులకు పాల్పపడుతూ రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకొని సరైన సమయానికి చెల్లించని వారికి టార్చర్ పెడుతున్నారు. లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను బంధువులు, స్నేహితులకు పంపడంతో అవమాన భారంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా రికవరీ ఏజెంట్లు ఏపీ మంత్రిని బెదిరించే స్థాయికి ఎదిగారు.
ఏపీ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ కి రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చింది. మీకు తెలిసిన వ్యక్తి లోన్ చెల్లించలేదని.. అతనికి బదులు మీరు డబ్బు చెల్లించాల్సి వస్తుందని.. రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పపడ్డారు. అంతేకాదు అతను తీసుకున్న డబ్బు మీరు చెల్లించని పక్షంలో మీ పరువు తీస్తామని మంత్రికి వార్నింగ్ ఇస్తూ కాల్ చేశారు. దీంతో మంత్రి కాకాని పీఏ శంకర్ కృష్ణపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన కృష్ణపట్నం పోలీసులు రికవరీ ఏజెంట్లతో పాటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. నింధితుల నుంచి లాప్ టాప్ తో పాటు నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.