ఇప్పటివరకు హిప్నటిజం, మాస్ హిస్టారియా వంటి పదాలు.. సినిమాల్లోనే విన్నాం. అలాంటి ఘటనలు బయట జరిగితే.. చూడడానికే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇలా జరిగింది ఒకరికో, ఇద్దరికో కాదు.. ఐదారుగురు విద్యార్థులు అలానే ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో హడలెత్తించారు. తలలు బాదుకుంటూ పక్కవారు చెప్పేది పట్టించుకోకుండా ఏడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే ఘటన రెండ్రోజుల క్రితం కూడా జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఒక పూజారిని వెంటబెట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. దుష్ట శక్తులు ఆవహించాయంటూ అయన దిష్టి తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని భగేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనను, ఓ జాతీయ ఛానెల్కు చెందిన జర్నలిస్ట్.. ట్విటర్లో పోస్ట్ చేశారు. Few students in a govt school in Bageshwar dist of #Uttarakhand on Wednesday suddenly started screaming and shouting. Some beleieve it's a "mass hysteria" phenomenon. A team of doctors will visit school today. pic.twitter.com/htsFjrcC0Y — Anupam Trivedi (@AnupamTrivedi26) July 28, 2022 మంగళవారం సైతం.. ఇలాంటి ఘటనే జరిగినట్లు స్కూల్ టీచర్లు, ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొంతమంది బాలికలు, ఒక మగ విద్యార్థి.. ఇలానే ప్రవర్తించారని పేర్కొన్నారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను 'మాస్ హిస్టీరియా'గా వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Sai Priya Missing: RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే! ఇదీ చదవండి: భర్తకి అనారోగ్యం! అశ్లీల వీడియోలతో ట్రాప్ చేసి.. నెల రోజులుగా కోరికలు తీర్చుకుంటూ!