పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదేలే.. ఈ డైలాగ్ వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా హిందీ అభిమానులైతే ఇప్పటికీ పుష్పరాజ్ మేనియాలోనే ఉన్నారు. అల్లుఅర్జున్ కు పాన్ ఇండియా స్థాయిని.. నార్త్ ఇండియాలో అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ గా పుష్ప పార్ట్2 సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సుకుమార్ మాత్రం పార్ట్ 2 విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కావాల్సినంత సమయం తీసుకుని స్టోరీని కూడా పూర్తిగా మార్చబోతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రిపులార్, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. మినిమం ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే ఆదరించే పరిస్థితి కనింపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పై బాధ్యత పెరిగిందని టాక్ వినిపిస్తోంది. ట్రిపులార్- కేజీఎఫ్ 2 సినిమాల్లో విలన్- హీరో మధ్య పోరాట సన్నివేశాలు హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సుకుమార్ కూడా అదే ట్రెండ్ ఫాలోకాబోతున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ప పార్ట్ 2పై స్పందించిన సుకుమార్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పుష్ప కంటే పార్ట్ 2లో చాలా సన్నివేశాలు అబ్బురపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పార్ట్ 1 కంటే పుష్ప-2లో ఫహద్ ఫాసిల్- అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలిపాడు.
అయితే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి పార్ట్ ను రూ.200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించి బాక్సీఫీస్ వద్ద రూ.365 కోట్లు కలెక్ట్ చేశారు. అయితే పార్ట్ 2ని మాత్రం రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాపై ఇప్పుడున్న అంచనాలను రీచ్ అయితే పుష్ప-2 సినిమా వారంలోగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. అయితే పార్ట్ 2 షూట్ జులై నెల నుంచి ప్రారంభం కానుంది. సినిమాని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న విష్ణుప్రియ డాన్స్!