Serial Actress Bhairavi: రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో మహిళలపై అకృత్యాలు ఆగటం లేదు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కొందరైతే.. జీవితాలు నాశనం చేసుకున్నవారు మరికొందరు. ప్రస్తుతం సినీ రంగంలో కొత్తరకం ట్రెండ్ కొనసాగుతోంది. పెళ్లితో నటీమణులను సొంతం చేసుకుని, వారితో వ్యభిచారం చేయించే దుర్మార్గులు తయారయ్యారు. తన భర్త తనను వ్యభిచారం చేయమంటూ వేధిస్తున్నాడని ఓ నటి డీజీపీ కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని వేల్లూరు జిల్లా కస్భాకు చెందిన పరమేశ్వరి అలియాస్ భైరవి తమిళ సీరియల్స్లో నటిస్తుంటుంది. ఆమెకు రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పరిచమయ్యాడు.
అతడికి ఇదివరకే పెళ్లై, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భార్యతో విడాకులు తీసుకుని గత కొన్నేళ్లనుంచి ఒంటరిగా ఉంటున్నాడు. భైరవిని చూడగానే రాజా దేసింగ్ మనసు పారేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆమెతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఆమెను ప్రేమలోకి దించాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు భైరవిని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలు కాపురం చేసిన తర్వాత తన క్రూర బుద్ధి బయటపెట్టాడు. ఆమెను వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి చేయసాగాడు. రాజాదేసింగ్ వేధింపులు భరించలేక భైరవి తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. అయితే, అతడి వేధింపులు మాత్రం ఆగలేదు.వ్యభిచారం చేయకుంటే భైరవిని, ఆమె పిల్లలను చంపుతానని బెదిరించటం మొదలుపెట్టాడు. దీంతో మార్చి 25వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజాదేసింగ్ వేధింపులు పెరగసాగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేయటానికి వెళ్లింది. శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఈ సంఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పుష్ప మూవీలోని కేశవాకి అరుదైన గౌరవం! ఇంతకన్నా ఏమి కావాలి?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.