ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా పెరిగింది. దర్శకుడు రాజమౌళి.. ఈ సంప్రదాయానికి తెర తీశాడని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి వసూళ్లు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. దక్షిణాదిన తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలే ఇలా భారీ వసూళ్లు సాధించాయి. దాంతో పలువురు బాలీవుడ్ హీరోలు, దర్శకులు దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హిందీ వివాదం కూడా తెరమీదకు వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఏ సినిమా ప్రమోషన్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చూసినా.. ఈ ప్రశ్నే ఎదురవుతుంది. తాజాగా అంటే సుందరానికి ప్రమోషన్స్ లో భాగంగా హీరో నానికి కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి బదులుగా నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: హీరోయిన్ విషయంలో దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన హీరో నాని!
పాన్ ఇండియా సినిమాలపై నాని మాట్లాడుతూ.. ”నా ఉద్దేశంలో మన సినిమాని మనమే పాన్ ఇండియా సినిమా అనుకోకూడదు. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది పాన్ ఇండియా సినిమా. కథ బాగుండి, మంచిగా తెరకెక్కించాలి, అది ప్రజలకి నచ్చాలి. అంతే కానీ యూనివర్సల్ కథలతో తీస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోదు. పుష్ప సినిమానే తీసుకుంటే ఇక్కడ మన నల్లమల అడవుల్లో జరిగే కథ. దానికి, బాలీవుడ్ కి ఏమైనా సంబంధం ఉందా? కానీ మంచి సినిమా, బాగా తెరకెక్కించారు కాబట్టి అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించడంతో అది పాన్ ఇండియా సినిమా అయింది’’ అన్నాడు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: ఆది పినిశెట్టి పెళ్లి వేడుకలో హీరో నాని సందడి! వీడియో వైరల్!
అంతేకాక ‘‘ప్రస్తుతం సినీ పరిశ్రమకి బంగారు దశ నడుస్తుంది. సినిమా బాగుంటే ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా విజయం సాధిస్తున్నాయి. మన తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమా పరిశ్రమకే మంచి రోజులు నడుస్తున్నాయి” అని అన్నారు. మరి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! కారణం..?