ఎక్స్ ట్రా జబర్దస్త్.. చూసేవారికి సుడిగాలి సుధీర్ టీమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అసలు ఇండస్ట్రీలో స్నేహాలు అంటేనే.. అవసరం నిమిత్తం అన్నట్లుగా ఉంటాయి అనే టాక్ ఉంటుంది. అలాంటిది.. వీరు ముగ్గురు చాలా ఏళ్లుగా కలిసి మెలసి ఉంటూ.. స్కిట్స్ చేస్తూ.. బుల్లితెర మీద స్టార్లుగా ఎదిగారు. వీరికోసమే ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే వారు ఉన్నారంఏట అతశయోక్తి కాదు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. గత కొంత కాలం నుంచి గెటప్ శ్రీను ఈ టీమ్లో కనిపించడం లేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు సుడిగాలి సుధీర్ కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ను విడిచిపెట్టి వెళ్లాడు. ప్రస్తుతం ఆటో రామ్ప్రసాద్ మాత్రమే మిగిలాడు.
ఈ క్రమంలో తాజాగా ప్రసారం అయిన ఎక్స్ట్రాజబర్దస్త్లో రాకెట్ రాకేష్ టీమ్ వీరి ముగ్గురి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చూపుతూ.. ఓ స్కిట్ చేసింది. సరదాగా ప్రారంభమైన స్కిట్.. ఎమోషనల్గా మారి.. ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. ఈ పదేళ్ల ప్రయాణంలో వీరు ముగ్గురు మధ్య చోటు చేసుకున్న అనుభవాలు.. ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలను ప్రేక్షకులకు చూపించారు. యాంకర్ రష్మితో సుధీర్ ప్రేమాయణాన్ని కూడా యాడ్ చేశారు.
ఆ తర్వాత గెటప్ శ్రీను టీమ్ను విడిచి పెట్టి వెళ్లడం.. కొద్ది రోజుల తర్వాత సుధీర్ టీమ్ను విడిచి పెట్టడం వెళ్లడం వంటి సంఘటనలతో స్కిట్ సాగింది. మిత్రులు ఇద్దరు వెళ్లిపోయాక రామ్ ప్రసాద్.. ఎంత బాధ పడ్డాడు.. తనకు తాను ఎలా సర్ది చెప్పుకున్నాడో వంటి సన్నివేశాలు.. ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించాయి. రష్మి, రామ్ ప్రసాద్, ఇంద్రజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేసినా.. వారి వల్ల కాలేదు.
ఇక స్కిట్ పూర్తయిన తర్వాత ఇంద్రజ మాట్లాడుతూ.. రామ్ ప్రసాద్కి, తనకు ఎవరిదో దిష్టి తగిలిందని.. అందుకే.. ఇలా అయ్యిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. అంతేకాక.. స్టేజీ మీదకు వచ్చి.. రామ్ ప్రసాద్ను కౌగిలించుకుని ధైర్యం చెప్పింది. ఆయన కూడా భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంది. ఇక అక్కడున్న మిగతా టీమ్ మెంబర్స్ కూడా కంటతడి పెట్టాడు.
ఈ స్కిట్ చూసిన నెటిజనులు.. రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, శ్రీనుల స్నేహబంధంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి మళ్లీ స్కిట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంద్రజ కూడా ఇదే కోరుకుంది. మరి.. సుడిగాలి సుధీర్ మళ్ళీ కలసి స్కిట్స్ చేయాలి మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.