విక్టరీ వెంకటేశ్– మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కీలక పాత్రల్లో.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2కి సీక్వెల్ F3 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. F2 సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ అంతేగా అంతేగా అనే డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే సినిమా బృందం విస్తృతంగా ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. F3పై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను తప్పకుండా రీచ్ అవుతుందని డైరెక్టర్ అనీల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు బల్లగుద్ది చెబుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. F3 సినిమాలో వెంకటేశ్- వరుణ్ తేజ్ హీరోలు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు కనిపించబోతున్నారని దిల్ రాజు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. F3 సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇలా టాలీవుడ్ లోని టాప్ హీరోలందరినీ చూపిస్తూ అనీల్ రావిపూడి ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో ఫ్యామిలీస్ కి మాత్రమే కాదు.. చిన్న పిల్లల కోసం కూడా రెండు ఎపిసోడ్లు ప్లాన్ చేశాడు’ అంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే నేరుగా కనిపిస్తారా? లేక వీడియోస్ రూపంలో చూపిస్తారా అనే దానిపై క్లారిటీ లేదు.
ఇక F3 సినిమా విషయానికి వస్తే.. ఇది పేరుకు సీక్వెల్ అయినప్పటికీ F2 సినిమాకి F3 సినిమాకి కథలో మాత్రం ఎలాంటి సంబందం లేదని చెప్పుకొచ్చారు. కథ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని అనీల్ రావిపూడి ఇప్పటికే చెప్పాడు. కథలో కూడా చాలా మార్పులు జరిగాయన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ కు కుటుంబం ఉంటుంది.. వరుణ్ కు ఫ్యామిలీ ఉండదని తెలిపాడు. ఇంక ఫన్ విషయానికి వస్తే F2 సినిమాకి రెండు రెట్లు అదనంగా నవ్విస్తారని ధీమా వ్యక్తం చేశారు. దిల్ రాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.