యాంకర్ రష్మీ గౌతమ్.. బుల్లితెరపై లీడింగ్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు. ఉటు వెండితెర మీద కూడా తన నటన, అందం, అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం యాంకర్ రష్మీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి యూట్యూబ్ లో సెన్సేషన్ గా నిలిచింది. ఆ ప్రోమోలో స్పెషల్ గెస్టుగా రాజశేఖర్ వచ్చాడు. స్పెషల్ జడ్జ్ గా ఆల్రెడీ శ్రద్ధా దాస్, ఇంద్రజాను తీసుకొస్తున్నారు. ఈ ప్రోమోలో ఫైమా స్కిట్ కూడా ఎంతో స్పెషల్ అట్రాక్టివ్ గా మారింది.
అయితే వాటన్నింటికి మించి చివర్లో యాంకర్ రష్మీని పెళ్లికూతురిగా చూపించడంతో అంతా కంగు తిన్నారు. సాధారణంగా ఆ షోలో పెళ్లిళ్లు చేయడం, లవ్ ట్రాక్ లు చూపించడం మామూలే అని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రోమోలో మాత్రం ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఎప్పుడూ నేరుగా సుడిగాలి సుధీర్ ను చూపించేవారు. లేదా సుధీర్ కోసం వేరే అమ్మాయిని పెట్టినా కూడా నేరుగా చూపించే వారు.కానీ, ఈసారి మాత్రం అలా కాకుండా ముఖానికి పూలు కట్టి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. అయితే ఇది నిజంగానే నిజం అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్పీ కోసం అయితే నేరుగా చూపించే వారు కదా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఈసారి రష్మీ నిజంగానే కాబోయే వాడిని పరిచయం చేస్తోందని టాక్ జోరందుకుంది. గతంలోనూ రష్మీ పెళ్లిపై పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ఇండస్ట్రీకి రాకముందే పెళ్లి, విడాకులు అయ్యాయని కూడా ప్రచారాలు చేశారు. అయితే ఇది టీఆర్పీ స్టంటా.. లేక నిజమేనా అనితెలియాలంటే ఎపిసోడ్ వచ్చే దాకా ఆగాల్సిందే. రష్మీ కాబోయేవాడిని పరిచయం చేస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.