ఐపీఎల్ 2022 సీజన్ అంచనాలకు మించి సాగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఉత్కంఠగా సాగిపోతోంది. ఐపీఎల్ స్పెషలిస్టులు అనే పేరుగాంచిన ఎందరో స్టార్ ప్లేయర్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేన్ మామ, శ్రేయస్ అయ్యర్ ఇలా ఎంతోమంది ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నారు. ఆ జాబితాలోకి రిషబ్ పంత్ కూడా చేరాడు. టెస్టుల్లో సైతం టీ20 బ్యాటింగ్ మజా అందించే పంత్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో డీలా పడుతున్నాడు. అయితే ఢిల్లీ జట్టుని ముందుండి నడపాల్సిన పంత్ ఆకట్టుకోకపోవడమే కాకుండా అతని వల్ల జట్టులో కూడా నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: KKR టీమ్ సెలెక్షన్పై సంచలన నిజాలు బయటపెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
ఒకప్పటి పంత్ ని చూసి చాలా కాలమైంది. క్రీజులో ఎంతో భయంగా కనిపిస్తున్నాడు, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ సీజన్లో మధ్యలో కెప్టెన్సీ తీసుకున్నా కూడా ఇంత బెరుకుగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ, ఈ సీజన్లో మాత్రం అసలైన పంత్ ను అందరూ మిస్ అవుతున్నారు. ఈ పరిస్థితిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. పంత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు రవిశాస్తిర అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా అతని ఒత్తిడి వల్ల జట్టుకు ఉన్న విజయావకాశాలు సైతం దూరమవుతున్నాయంటూ అభిప్రాయపడ్డాడు. పంత్ ఒకసారి ట్రాక్ లోకి వస్తే అన్ని పరిస్థితులు దారిలోకి వస్తాయంటూ వ్యాఖ్యానించాడు.
పంత్ ఫామ్ పై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పంత్ తాను కెప్టెన్ అనే విషయాన్ని మర్చిపోవాలి. కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ను చూసి పంత్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రస్సెల్ ఎంతో కూల్ గా బ్యాటింగ్ చేస్తుంటాడు. పంత్ కూడా అలాంటి బ్యాటింగ్ స్టైల్, కూల్ గా ఉండటం అలవరుచుకోవాలి. ఆండ్రూ రస్సెల్ తరహాలో పంత్ తనని తాను మార్చుకోవాలి’ అంటూ రవిశాస్త్రి సలహాలు, సూచనలు చేశాడు. ఇంక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 5 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రిషబ్ పంత్ కు రవిశాస్త్రి చేసిన సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.