‘బిగ్ బాస్ హౌస్’ ప్రస్తుతం ఎంతో బాధ, కన్నీళ్లతో నిండిపోయింది. ప్రతివారి నామినేషన్ అంటే ఫుల్గా ఆరోపణలు, విమర్శలతో ఉండేది. ఈ వారం మాత్రం కన్నీళ్లు, కుటుంబసభ్యుల మెమొరీస్తో నిండిపోయింది. మనుషుల నుంచి ఎమోషన్స్ బయటకు తీయాలి అంటే బిగ్బాస్ తర్వాతే ఎవరైనా అనుకుంట. ఈ వారం నామినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. కుటుంబసభ్యుల నుంచి లెటర్లు తెప్పించి.. ఇద్దరిని సెలక్ట్ చేసి వారికి లెటర్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాలి. వారి రీజన్స్ విన్న తర్వాత ఇద్దరు న్యాయనిర్ణేతలు నిర్ణయం తీసుకోవాలి. అలా హౌస్లోని ఇద్దరు, ఇద్దరు లెటర్లు పంపి బిగ్బాస్ బాగానే ఎమోషన్స్ను పండించాడు. అందులో ముఖ్యంగా ఇంట్లోని సభ్యుల జీవితాల్లో బయట ఎన్ని ఇంపార్టెంట్ విషయాలు జరుగుతున్నాయో కూడా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇదీ చదవండి: షమీపై ట్రోలింగ్ కి రియాక్షన్ గా వీడియో వైరల్!
ఇద్దరి లెటర్లు కలిపి పంపే క్రమంలో ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్ లెటర్లు వస్తాయి. వారికి యానీ మాస్టర్, సిరి న్యాయనిర్ణేతలుగా ఉంటారు. షణ్ము లెటర్ చూడగానే ఆర్జే కాజల్ను తీసుకోమని చెప్తాడు. కాజల్ ముందుగానే షణ్నుని తీసుకోమని చెప్తుంది. కాజల్కు తన భర్త నుంచి లెటర్ వస్తుంది. ‘నాకు వీడియో వచ్చింది. నీకు ఇప్పటివరకు ఏమీ రాలేదు కదా తీసుకో’ అని కాజల్ అంటుంది. అందుకు షణ్ముఖ్ ఒప్పుకోడు. మధ్యలో సిరి ఉండి నేను లెటర్ ఇవ్వను అంటుంది. ‘ఆ లెటర్ తీసుకోకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నేను ఆ బాధ పడుతున్నా.. నువ్వు అలా చేయకు’ అంటూ సిరి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ షణ్ముఖ్ ఒప్పుకోడు.
చివరికి కాజల్కు లెటర్ అందుతుంది. అప్పుడు షణ్ముఖ్ చాలా భావోద్వేగానికి గురవుతాడు. ‘అమ్మా నువ్వు క్యాన్సర్ను జయించావు. అమ్మమ్మ చనిపోయినప్పుడు తట్టుకున్నావు. నువ్వే నాకు ఇన్స్పిరేషన్. నేను ఈ బాధను తట్టుకుంటాను’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ షణ్ముఖ్ చూపించిన మెచ్యురిటీకి ఆనందంతో చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటారు.