‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. కొందరు కంటెస్టెంట్లు విజయాన్ని ఆస్వాదిస్తుంటే.. కొందరేమో బిగ్ బాస్ మిగిల్చిన చేదు అనుభవాలను నెమరువేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ సిరి- షణ్ముఖ్ పై బాగా పడినట్లు తెలుస్తోంది. సిరి ఎక్కడికి వెళ్లినా హగ్గుల గురించే అడగడంతో పూర్తిగా విసుగెత్తిపోయింది. షణ్ముఖ్ కేమో తన రిలేషన్ పై బిగ్ బాస్ ఎఫెక్ట్ బాగా పడినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ ను రిసీవ్ చేసుకోవడానికి కూడా దీప్తీ సునైనా రాలేదు. ఆ తర్వాత సెలబ్రేషన్స్ లోనూ ఆమె కనిపించలేదు. షణ్ముఖ్ కు సంబంధించి ఎలాంటి పోస్టు పెట్టలేదు. అసలు షణ్ముఖ్ ను కలిసిందో లేదో కూడా ఎవరికీ తెలీదు.
తాజాగా దీప్తీ సునైనా ఇన్ స్టాగ్రామ్ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్టు కచ్చితంగా షణ్ముఖ్ కోసమే పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. మాములుగా షణ్ముఖ్ మాటల ప్రకారం వీళ్లిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చినా రెండు, మూడు నెలలు మాట్లాడుకోరు. అలాగే ఇప్పుడు కూడా ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. కానీ, ఆ పోస్టు చూశాక అలా అనిపించేలా లేదు. పైగా ఆ పోస్టు పెట్టింది షణ్ముఖ్ కోసమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే ‘కనీసం నీ మనసాక్షితోనైనా నిజాయితీగా ఉండు’ అనే అర్థం వచ్చేలా ‘బీ ఆన్సరబుల్ టూ యువర్ సెల్ఫ్ ఎట్ లీస్ట్’ అంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీప్తీ సునైనా పెట్టిన ఆ పోస్టు షణ్ముఖ్ కోసమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.