‘బిగ్ బాస్ 5 తెలుగు’ కంటెస్టెంట్ల జీవితాలను మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. అంతంత మాత్రం ఫ్యాన్స్ బోస్ తో హౌస్ లోకి అడుగుపెట్టి సెలబ్రిటీలుగా తిరిగొచ్చారు. వాళ్లందిరిలో సిరి- షణ్ముఖ్ భవిష్యత్ మాత్రం అర్థం కాకుండా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సిరి- శ్రీహాన్ కలుస్తారా లేదా? దీప్తీ సునైనా- షణ్ముఖ్ ఎలా ఉంటున్నారు అనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి. సిరి- శ్రీహాన్ కంటే షణ్ముఖ్- దీప్తీ సునైనా జంట గురించే అందరి ఆసక్తి. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే తర్వాత ఇంతవరకు వాళ్లిద్దరూ కలిసినట్లు ఎక్కడా దాఖలాలు లేవు.
మరోవైపు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో దీప్తీ సునైనా పోస్టులను ఆమె జీవితానికి ముడిపెడుతూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా దీప్తీ సునైనా ఫేస్ బుక్ పేజ్ లో తన ఫొటో ఒకటి షేర్ చేసి దానికి పెట్టిన మెసేజ్ నెట్టింట వైరల్ గా మారింది. ‘మార్పు సౌకర్యవంతంగా ఉండదు.. కానీ తప్పదు’ ‘Change Is Uncomfortble But Necessary’ అని పోస్టు చేసింది. ఆ పోస్టు షణ్ముఖ్ గురించే అనేది నెటిజన్ల భావన, వాదన. ఇంకొందరైతే కామెంట్స్ లో దీప్తీ సునైనా సరైన నిర్ణయం తీసుకున్నట్లు అభినందిస్తున్నారు.
కొందరైతే షణ్ముఖ్ క్యారెక్టర్ ను జడ్జ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకు ఉన్నదేదో డైరెక్ట్ గా చెప్పేస్తే ఏ గోలా ఉండదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. వారి మధ్య దూరం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ, అది శాశ్వతమా? కొంతకాలమేనా అనేది వాళిద్దరే స్పందించాలి. అప్పటి వరకు ఇలా ఊహాగానాలు, అంచనాలు వేస్తునే ఉంటారు. దీప్తీ సునైనా- షణ్ముఖ్ మధ్య దూరం పెరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.