Viral Video: భారత్లో విదేశీ వ్యక్తులకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫారెన్ యువతుల్ని చూడగానే జనం అదోమాదిరి ఇదిలోకి వెళ్లిపోతుంటారు. వారిని చూస్తూ ఉండి పోతుంటారు. గ్రామాలనుంచి వచ్చిన వ్యక్తుల గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారితో మాట్లాడటానికి, కుదిరితే ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతోంది. ఢిల్లీలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2017లో ఆస్ట్రేలియాకు చెందిన సెలియా వాయ్వోడిచ్ అనే యువతి ఇండియా పర్యటనకు వచ్చింది. ఇండియా గేట్ వద్ద ఆమె పర్యటనలో ఉన్నపుడు కొంతమంది యువకులు ఆమె దగ్గరకు చేరుకున్నారు. ఆమె అంగీకారంతో సెల్ఫీలు దిగారు. ఆమె అక్కడినుంచి పక్కకు వచ్చేసినా వదల్లేదు.
ఓ యువకుడు ఆమె దగ్గరకు వచ్చి.. ఏదో లవర్ మీద చెయ్యి వేసినట్లు మెడ చుట్టూ చెయ్యి వేసి మరీ సెల్ఫీ దిగాడు. ఆ వెంటనే మరికొంత మంది ఎగబడ్డారు. ఆమె కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో అందరికీ సెల్ఫీలు ఇచ్చింది. తర్వాత ‘‘ఒక్కో ఫొటోకు 100 రూపాయలు’’ ఇవ్వాలి అని అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరో సారి వైరల్గా మారింది. దీనిపై సెలియా ఫేస్బుక్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘‘ అవును, ఆ ప్రదేశంలో నాకు ఎంతో ఆదరణ లభించింది. నా దగ్గరకు వచ్చిన వాళ్లు నటులు కాదు. నిజంగానే ఫొటోలు దిగటానికి వచ్చారు’’ అని తెలిపింది. ఆ ఫొటోలు తీసుకునే పర్వం దాదాపు 45 నిమిషాలు జరిగిందని వెల్లడించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇండియాకు వరల్డ్ కప్ సాధించిన బ్లైండ్ కపిల్ దేవ్ కన్నీటి గాథ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.