సాధారణంగా మనం చూసే పెళ్లిళ్లలో ఎక్కడైన వరుడు మాత్రమే వధువుకు తాళి కడతాడు. ఇది సాంప్రదాయం బద్దంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కానీ ఇక్కడ మాత్రం దీనికి రివర్స్. అవును మీరు విన్నది నిజమే. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో గురువారం సామూహిక వివాహాలు జరిగాయి. ఈ పెళ్లిలో తరతరాలుగా వస్తున్న ఆ గ్రామస్తులు తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ 47 జంటలకు ఒకే ముహూర్తంలో వివాహం చేశారు.
ఇది కూడా చదవండి: Scorpions: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో వేల కొద్దీ తేళ్లు..
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వరుడి మెడలో కూడా వధువు తాళి లాంటి వస్తువును కట్టటం విశేషం. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని నువ్వలరేవు గ్రామానికి వందల సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి కేవిటీ కులస్తులు వలస వచ్చారట. వీరంతా చేపల వేటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వివాహం విషయంలో వీరి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పా మిగిలిన సమయంలో ఆ గ్రామంలో ఇంకెప్పుడూ పెళ్లి అనే మాటనే వినపడదు.
ఒకరిని ఒకరు ఇష్టపడి, ఇరు కుటుంబాలు అంగీకరించి, పెళ్ళికి సిద్దంగా ఉన్న యువతీ యువకులకు పెళ్లి చేస్తారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? గ్రామంలో వాళ్ళని తప్పా మరే ఇతర గ్రామాల వారిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఆచారాన్నే మేము కూడా కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక వరుడి మెడలో వధువు తాళికడుతున్న వీరి ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.