ఈ మధ్య పెళ్లి వేడుకల్లో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవే కాకుండా చిన్న చిన్న కారణాలకు కొందరైతే అక్కడికక్కడే పెళ్లీ పీటల మీదే వివాహాలు క్యాన్సిల్ చేసకుంటున్నారు. పెళ్లి కొడుకు చదువుకోలేదని, వరుడికి బట్టతల ఉందని ఇలా ఇలాంటి కారణాలతో పెళ్లిళ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే జరిగిన ఓ పెళ్లి వేడుకలో పెళ్లి వేడుకకు ఫోటో గ్రాఫర్ రాలేదని వధువు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ అమ్మాయికి అదే జిల్లాకు చెందిన భోగ్నిపూర్కు చెందిన అబ్బాయితో పెళ్లికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఇక వరుడు కోరిన కట్నంతో పాటు ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ వధువు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఇక పెళ్లి వేడుక కూడా మొదలైంది.
ఇది కూడా చదవండి: Video: పాపం ఎంగేజ్ మెంట్ రోజే అల్లరిపాలయ్యాడు..!
వరుడు, వధువు పెళ్లిపీటలపై కూర్చుకున్నారు. పెళ్లి తంతుతో భాగంగా దండలు మార్చుకుంటున్నారు. ఈ సమయంలోనే ఫోటో గ్రాఫర్ లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటారంటూ వధువు వరుడు బంధువులను ప్రశ్నించింది. ‘పెళ్లి వేడుకనే సరిగ్గా పట్టించుకోనివాడు… రేపు పెళ్లయ్యాక తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకమేంటి’ వధువు పెళ్లిపీటల మీదకు వచ్చిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురి పెళ్లి పెద్దలు ఓ చోట కూర్చోని మాట్లాడుకునే ప్రయత్నం చేశారు.
అయినా ఎంతకు కూడా వధువు అంగీకరించకపోవడంతో వధువు బంధువులు అతనితో పెళ్లి వద్దన్నకున్నారు. దీంతో చేసేదేం లేక అప్పటిదాకా ఇచ్చిపుచ్చుకున్న డబ్బు, నగలు, వస్తువులు ఎవరివి వాళ్లకు ఇచ్చేసుకుని రెండు కుటుంబాలు వెనుదిరిగాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.