అమ్మ.. ఓ మనిషి జీవితంలో ఇంత కన్నా తోడు, ధైర్యం ఉండదు. కడుపులో పెట్టుకుని చాకే అమ్మ లేకపోతే ఎంతటి వారికైనా పెద్ద కష్టం వచ్చినట్టే. కానీ.., కాల ధర్మానికి ఈ ప్రేమ, ప్రీతి ఉండవు కదా? ఇలాగే కాలం ఓ తల్లిని తనలో కలిపేసుకుంది. కానీ.., ఆ తల్లి కొడుకు మాత్రం అమ్మని మరచిపోలేకపోయాడు. తన చుట్టూ ఎందరు ఉన్నా, తల్లి లేని ఆ లోటుని భరించలేకపోయాడు. వెంటనే శ్మశానికి వెళ్లి తన తల్లి శవాన్ని తెచ్చుకుని తనతో పాటు ఇంట్లో పెట్టుకున్నాడు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి :
కష్టమైనా మార్పు తప్పదు! దీప్తీ సునైనా పోస్టు వైరల్!
పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్ వయసు 38 సంవత్సరాలు. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఎదిగే క్రమంలో అతను మితి స్థిమితం కూడా కోల్పోయాడు.తండ్రి లేని ఆ అమాయకుడిని తల్లి ముక్కాయి కడుపులో పెట్టుకుని చాక్కుంది. బాలమురుగన్కి తల్లి తప్ప మరో లోకం తెలియదు. కానీ.., ప్రమాదవశాత్తు 11 నెలల క్రితం అతని తల్లి ముక్కాయి కూడా చనిపోయింది. అప్పటి నుండి బాలమురుగన్ కి కన్నీరు తప్ప ఏమి మిగలలేదు. ఇంటికి రావడం మానేశాడు. మనుషులతో పలకడం మానేశాడు. తల్లినే తలుచుకుంటూ పూర్తిగా పిచ్చివాడయ్యాడు. ఈ క్రమంలోనే తరచూ శ్మశానం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వర్షం పడుతున్నప్పుడు తల్లి సమాధిపై నీరు పడకుండా పట్టలు అడ్డం పెట్టేవాడు. అలా చాలా రోజులు సమాధిపైనే నిద్రించేవాడు బాలమురుగన్.
అయితే.. కొన్ని రోజుల క్రితం బాలమురుగన్ సడెన్ గా ఇంట్లో ప్రత్యక్షం అయ్యాడు. బాలమురుగన్ ఇంటికి వచ్చాడు అని తెలుసుకున్న బంధువులు అతనికి అన్నం పెట్టడానికి ఇంట్లోకి వెళ్లగా అందరిని బయటకి నెట్టేశాడు. అదే సమయంలో బంధువులకి ఇంట్లో నుండి ఇంట్లో దుర్వాసన రావడం మొదలైంది. దీంతో.. ఇరుగుపొరుగు వారు పోలీసులకి సమాచారం అందించారు. బాలమురుగన్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఇల్లంతా వెతికి చూడగా.. ఓ గదిలో తల్లి ముక్కాయి శవం బాగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో.. చుట్టూ ఉన్న ప్రజలతో పాటు, పోలీసులు కూడా అవాక్కయ్యారు.
పోలీసులు మృతదేహాన్ని పెరంబలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారు దర్యాప్తు చేపట్టారు. అమ్మపై ప్రేమతో బాలమురుగన్ సమాధిని రోజు కొద్దికొద్దిగా సమాధి తవ్వి తల్లి శవాన్ని బయటకి తీశాడు. అర్ధరాత్రి సమయంలో చెత్త బండిలో పెట్టుకొని బాలమురుగన్ తన శవాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్లు విచారణలో తేలింది. అయితే.. మతిస్థిమితం లేకపోవడం, తల్లి మీద ప్రేమ తప్ప మరో చెడు ఆలోచన లేకపోవడంతో బాలమురుగన్ ని పోలీసులు కూడా ఏమి అనలేదు. కానీ.. కోట్ల ఆస్తులు పంచుకుని తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న కొడుకులు ఉన్న ఈ కాలంలో కూడా బాలమురుగన్ లాంటి కొడుకు ఉండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.