సోషల్ మీడియా వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు దక్కాలంటే చాలా సమయం పట్టేది. అంత ఒపికగా ఎదురు చూసినా.. అవకాశాలు లభిస్తాయా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితులు ఉండేవి. కానీ సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా సరే.. వారికి సత్వరమే తగిన గుర్తింపు లభిస్తుంది. రాత్రికి రాత్రే స్టార్స్గా ఎదుగుతున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఉపయోగంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Bangkok: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం చేస్తున్న డాక్టర్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ సంఘటన ఇరాక్లో చోటు చేసుకుంది. ఇక వీడియోలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తండ్రి, కుమారులుగా గుర్తించారు. తండ్రి షూటింగ్లో ఎక్స్పర్ట్. అయితే అతడి ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదు. దాంతో ఈ తండ్రి కొడుకులు ఓ ప్రయోగం చేశారు. దానిలో భాగంగా కుమారుడు.. నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉండగా.. తండ్రి కాస్త దూరం నుంచి తన ఏకే-47 గన్తో షూట్ చేశాడు. బుల్లెట్ సరిగ్గా వెళ్లి.. సిగరెట్కి తాకింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరలయ్యింది. అయితే దీనిపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు ఏంటి.. టైం బాగోలేక గురి తప్పితే.. ఏం చేస్తావ్.. పిల్లలతో ఇలాంటి పనికిమాలిన ఫీట్లు చేయడం ఏంటి అంటూ నెటిజనులు తండ్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వెంటనే ఆ తండ్రిపై చర్యలు తీసుకుని.. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చనిపోయిందనుకున్న మహిళ శవపేటికలోంచి లేచొచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!