ప్రతి రోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనకు ఆశ్చర్యానికి కలిగించక మానవు. కొందరు ప్రమాదాల నుంచి రెప్పపాటు కాలంలో బయటపడతారు. వారిని యమజాతకులు అంటారు. తాజాగా ఓ యువకుడు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చింది. క్షణికా కాలంలో దూసుకొచ్చిన రైలు నుంచి తప్పించుకున్నాడు. రైలు వేగానికి బైక్ తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారు.. అదృష్టం అంటే వీడిదే రా..బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని అచౌద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు పట్టాలు దాటేందు ప్రయత్నించాడు. ఇంతలో అటుగా వేగంగా వస్తున్న రైలును గ్రహించిన ఆ యువకుడు.. బైక్ ను అక్కడే వదిలేసి తృటిలో తప్పించుకున్నాడు. రైలు వేగం ధాటికి బైక్ ముక్కలైంది. ఈ ప్రమాదంలో అతనికి చిన్న చిన్న గాయాలయ్యాయి.
దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రాథమిక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ యువకుడిని అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఆ సంఘటన కచ్చితంగా అతనికి, అలాంటి వ్యక్తులకు ఇది ఒక గుణపాఠం అనిపిస్తుందని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.