కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. సాధారణ జీవితం నెలకొంటోంది అని భావించిన తరుణంలో ఒమిక్రాన్ ఎంట్రీతో మొత్తం తల్లకిందులైంది. అప్పటి నుంచి దేశంలో డోలో-650 అమ్మకాలు, వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోయిందని చెబుతున్నారు. అది కూడా అంతా ఇంతా కాదు ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్లు కొనగోలు చేశారన్న లెక్కలు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి.
🇮🇳Dolo 650 is now India’s favoured paracetamol brand, with sales of Rs 567 crore since March 2020. It’s even trending on social media and is the subject of memes.
.
.
source : The Print#dolo650 pic.twitter.com/OurowcHzM2— Dais World ᵀᴹ (@world_dais) January 16, 2022
అత్యంత ఎక్కువగా వినియోగించిన ఔషధంగా డోలో-650 ట్యాబ్లెట్ రికార్డులు సృష్టిస్తోంది. 350 కోట్ల ట్యాబ్లెట్లను వరుసగా పేర్చితే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుకంటే 6 రెట్లు ఎక్కువగా.. బుర్జ్ ఖలీఫా ఎత్తుకంటే 63 వేల రెట్లు ఎక్కవ అవుతుందని చెబుతున్నారు. 2020-21లో డోలో అమ్మకాలు రెట్టింపయ్యాయి. కరోనా రాక ముందు 2019లో 7.5 కోట్ల డోలో స్ట్రిప్స్ అమ్మకాలు జరిగితే.. 2020-21 సంవత్సరంలో ఏకంగా 350 కోట్ల డోలో ట్యాబ్లెట్లు అమ్మడయ్యాయి.
Manufactured by Bengaluru-based Micro Labs Ltd, Dolo 650 has registered unprecedented sales, clocking in over Rs 560 cr in sales, crushing nearly 40 other brands in the segment, according to a report. pic.twitter.com/NGGUtqcTLj
— BurnerBits (@burner_bits) January 17, 2022
టర్నోవర్ పరంగా భారతదేశంలో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న జ్వరం ట్యాబ్లెట్ల జాబితాలో డోలో రెండోస్థానంలో ఉంది. ఆ కంపెనీ టర్నోవర్ రూ.307 కోట్లకు చేరుకుంది. GSKకి చెందిన కాల్ పోల్ ట్యాబ్లెట్ కంపెనీ రూ.310 కోట్ల టర్నోవర్ లో కాస్త ముందుంది. డోలో అమ్మకాలే కాదు.. గూగుల్ లోనూ రికార్డు సృష్టిస్తోంది.
కరోనా మొదలైన తర్వాత నుంచి గూగుల్ లో అత్యధికసార్లు వెతికిన కీ వర్డ్ జాబితాలోనూ చోటు దక్కించుకుంది. దాదాపు 2 లక్షల సార్లు డోలో కీ వార్డును వెతికారట. 2019లో పారాసెట్మాల్ ఫార్ములాతో వచ్చే అన్ని కంపెనీల అమ్మకాలు రూ.530 కోట్లు కాగా.. 2021లో అవి రూ.924 కోట్లకు చేరుకున్నాయి.
Dolo 650 Become India’s Favourite Tablets in covid wave with sales of Rs.567 crore since march 2020. #MBN #MBnews #paracetamol #covid #covid-19 #corona 2020 #dolo650 #favouritetablet pic.twitter.com/REMjujcqZh
— Maharashtra Bandhu (@MaharashtraBan2) January 17, 2022