Snakes: ఈ మధ్య ఇళ్లలో పెద్ద సంఖ్యలో పాములు బయటపడ్డం మామూలైపోయింది. దేశం లోని చాలా ప్రాంతాల్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో పాములు బయటపడి, వాటికి సంబంధించిన ఫొటోలు, వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఇలాంటి మరో సంఘటన వెలుగు చూసింది. ఒక కుండలో ఏకంగా వందకు పైగా నాగు పాములు బయటపడ్డాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్నగర్ జిల్లాలోని మధున అనే గ్రామంలోని ఓ ఇంట్లో వంద ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద మట్టి కుండ ఉంది. గత కొద్దిరోజులనుంచి ఆ కుండలోంచి వింతవింత శబ్ధాలు వస్తున్నాయి. దీంతో ఇంటి సభ్యులు దాంట్లో ఏముందో అని తెరిచి చూశారు. లోపల పెద్ద మొత్తంలో పాములు ఉండటం చూసి షాక్ అయ్యారు. దాదాపు 100కు పైగా పాములు కుండలో ఉన్నట్లు గుర్తించారు.
ఆ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కుండలో పాములు ఉన్నాయన్న సంగతి ఊరు మొత్తం పాకి పోయింది. వాటిని చూడ్డానికి జనం ఎగబడ్డారు. అన్ని పాములు ఒకే చోట కనిపించటం ఏదో కీడుకు సూచనగా కొంతమంది చెప్పుకొచ్చారు. మరికొంత మంది కాల సర్పదోషం కారణంగానే ఇలా పాములు కనిపిస్తున్నాయని అన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది కుండలోని పాములను పట్టి, అడవిలో వదిలేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
उप्र के अंबेडकर नगर में एक बंद पड़े घर से दर्जनों सांप दिखे।
नोट–ये सांप ज़हरीले नहीं हैं। pic.twitter.com/hi8Q9Pkf01— Ravish Ranjan Shukla (@ravishranjanshu) May 11, 2022
ఇవి కూడా చదవండి : Srikakulam district: అమ్మ కోసం ఏకంగా గుడి కట్టేశాడు! అంతా బంగారమే!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.