టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా గాయాల కారణంగా వరుసగా స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల క్రికెటర్లు గాయాల బారిన పడి సతమతమవుతున్న తరుణంలో.. మరో స్టార్ క్రికెటర్ గాయం కారణంగా ఆస్పత్రి పాలైయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోస్ ఇంగ్లీస్ గోల్ఫ్ ఆడుతుండగా ప్రమాదానికి గురైయ్యాడు. ఈ క్రమంలోనే అతడి చేతికి గాయం కావడంతో అతడిని సిడ్ని లోని హస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతడి చేతి నుంచి చాలా రక్తం కారినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
జోస్ ఇంగ్లీస్.. ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడిప్పుడే స్థానం కోసం పోరాడుతున్నాడు. మ్యాథ్యూ వేడ్ తో పాటుగా జోస్ ఇంగ్లీస్ ను అదనపు వికెట్ కీపర్ గా ఆస్ట్రేలియా బోర్డ్.. టీ20 వరల్డ్ కప్ కు ఇంగ్లీస్ ను జట్టులోకి తీసుకుంది. అయితే జోస్ మంగళవారం సిడ్నీలో గోల్ఫ్ ఆడుతున్న తరుణంలో అతడికి గాయం అయ్యింది. చేయి కోసుకుపోవడంతో.. అతడిని దగ్గరలో ఉన్న హస్పిట్లో అడ్మిట్ చేసినట్లు జట్టు అధికారిక ప్రతినిధి సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రికతో తెలిపాడు. దీంతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆసిస్ కు భారీ ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి. కేవలం 9 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న ఇంగ్లీస్.. 141 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో కూడా గోల్ప్ ఆటలో గాయపడి టోర్నీకి దూరం అయిన సంగతి తెలిసిందే.
Injury concerns for Australia as Josh Inglis was rushed to the hospital after a bizarre golf accident.#Australia #JoshInglis #T20WorldCup https://t.co/C9oORqEzyU
— CricTracker (@Cricketracker) October 19, 2022