గత కొంత కాలంగా టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసుకోవడమేకాకుండా.. హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ను హార్దిక్ పాండ్యా దెబ్బతీశాడు. ఏడు ఓవర్లలో మూడు మెయిడిన్లు ఇచ్చి.. కేవలం 24 నాలుగు రన్లు ఇచ్చాడు. ఇక బ్యాటింగ్ లోనూ తన సత్తా చాటాడు. 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో 4+ వికెట్లు తీసి.. 50+ రన్స్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
ప్రపంచ క్రికెట్ లో రెండో క్రికెటర్ గా ఈ ఫీట్ సాధించాడు. అంతకు ముందు పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తానికి 260 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ భారత్ విజయానికి ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
6⃣ Wickets 💥
1⃣0⃣0⃣ Runs 💪For his solid all-round performance, @hardikpandya7 bags the Player of the Series award. 👍 👍 #TeamIndia | #ENGvIND pic.twitter.com/iOY9pLPeIG
— BCCI (@BCCI) July 17, 2022