హీరో కొడుకు హీరో అవుతున్నట్టే.., పొలిటీషియన్ కొడుకులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మన దేశంలో సర్వ సాధారణం. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వారసత్వ రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కానీ.., ఉద్యమ సమయంలోనే ఆయన రాజకీయ వారసుడిగా కేటీఆర్ జనంలోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కేటీఆర్ తరువాత కల్వకుంట్ల వంశంలో కాబోయే నాయకుడు ఎవరంటే అంతా కేటీఆర్ కొడుకు హిమాన్షు అనే చెప్తారు. కానీ.., పార్టీ నేతలకి, గులాబీ అభిమానులకి షాక్ ఇస్తూ హిమాన్షు సంచలన ప్రకటన చేశాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. “నేను ఇక్కడ ఓ విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నా ద్రుష్టి అంతా వాటి మీదే. అంతే తప్ప తనకి రాజకీయాల మీద ఆసక్తి లేదు” అని హిమాన్షు తేల్చి చెప్పాడు. హిమాన్షు చేసిన ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు గులాబీ వర్గాలను ఆందోళనకి గురి చేస్తోంది. ఇక ఈ నెల 12న హిమాన్షు 16వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్బంగా తన కోసం ఎవరు పుష్ప గుచ్చాలు తీసుకు రావద్దని, వీలైతే మొక్కలు నాటందని హిమాన్షు పిలుపు ఇవ్వడం గమనార్హం.ఇదేమైనా చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్న హిమాన్షుని నెటిజన్స్ ప్రశంసిస్తుండటం విశేషం.
I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve.
Thank you!
Hope you have a great day 😊— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 6, 2021