ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే దాన్ని ఎత్తిచూపుతూ ఎవరో ఒకరు పోస్ట్ పెట్టేస్తున్నారు. ఇక అదే సినిమా ప్రముఖులు, సెలబ్రెటీల విషయంలో ఐతే ఇక చెప్పక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా వారిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తారు. అందుకే చాలా మంది ఎక్కడా చిన్న మాట కూడా తప్పు దొర్లకుండా జాగ్రత్తపడుతుంటారు.
కానీ ఎప్పుడో ఓ సారి ఎవరో ఒకరు నెటిజన్స్ కు చిక్కుతారు కదా. ఇదిగో ఇలాగే ప్రముఖ యాంకర్ ఉదయ భాను చిన్న మాట నోరు జారడంతో ఆమెపై ట్రోల్స్ తో సోషల్ మీడియాలో ఓ అట ఆడుకున్నారు. ఇదంతా తిరుపతిలో జరిగిన అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప సక్సెస్ పార్టీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. పుష్ప మూవీ కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ప్రకటించే అధికారిక లెక్కలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తుంటాయి.
పుష్ప కలెక్షన్ల విషయంలో మైత్రీ మీవీస్ సంస్థ చూపిస్తున్న అత్యుత్సాహం, చెబుతున్న లెక్కలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఉదయ భాను చేసినదానికి ఈ విషయం మరింత చర్చనీయాంశమవుతోంది. పుష్ప సినిమా కలెక్షన్ల విషయంలో ఉదయభాను పొరబడింది. పుష్ప సక్సెస్ మీట్లో ఉదయ భాను నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఉదయ భాను పొరబాటుగా పుష్ప కలెక్షన్లను తప్పుగా పలికడంతో నెటిజన్స్ పాయింట్ అవుట్ చేశారు.
పుష్ప సినిమా 203 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పబోయి, 2003 కోట్లు కలెక్ట్ చేసిందంటూ చెప్పేసింది ఉదయభాను. దీంతో ఉదయ భాను నెటిజన్స్ కు చిక్కింది. ఇప్పటికే పుష్ప కలెక్షన్ల విషయంలో మైత్రీ మూవీస్ చెబుతున్నదే ఎక్కువ అంటే, ఇప్పుడు ఉదయ భాను దాన్ని మరింత ఎక్కువ చేసి చెబుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొంత మంది ఉదయ భానుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఇంతలా ట్రోల్ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.
Genuine aa fake aa pakkana pedithe,Papam anchor #UdayaBhanu 203 Crs ani cheppaboyi 2003 ani cheppindhi Anchor chesina mistake ni Historic Mistake laga andharu, mukyam ga #Mahesh fans adhe paniga tweets vesthu kurchunnaru.Dhenikaina oka limit untundhi🤦#PushpaTheRise
— Chandu Cherry (@alwayZ_chandu) December 22, 2021