ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు ప్రజలకు సేవకులే. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం అవుతోంది. చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజలే తమకు సేవకులుగా భావిస్తుంటారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం.. తాము ఎప్పటికి ప్రజలకు సేవకులమే అని నిరూపిస్తుంటారు. మరికొందరు అయితే ప్రజల అడగక ముందే తనిఖీలు నిర్వహించి.. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తుంటారు. అలాంటి వ్యక్తే.. తమిళనాడుకు చెందిన ఓ ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి.. టాయిలెట్స్ అశుభ్రంగా ఉండటంపై అసహనం చెందారు. తానే స్వయంగా చీపురు పట్టి టాయిలెట్స్ గదులను శుభ్రం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్.పీ. వెంకటేశ్వరన్. ప్రజల సమస్య తెలుసుకునేందుకు ఆయన లిట్టారం అనే ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి.. అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై మండిపడ్డారు. మరుగుదొడ్డి నుంచి ఘోరం దుర్వాసన వస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన స్వయంగా చీపురు పట్టి టాయిలెట్స్ రూములను శుభ్రం చేశారు. ఇలానే ప్రతి రోజూ శుభ్రంగా ఉంచుకోవాలని హెడ్ మాస్టర్ కి సూచించారు. పాఠశాల ఆవరణం మొత్తం దోమల మందు చల్లించాలని స్థానిక అధికారికి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటకటేశ్వరన్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో భాగంగా డెవలప్ మెంట్ ఫండ్ నుంచి అత్యాధునికి సౌకర్యాలతో మరుగుదొడ్డిని నిర్మిస్తామన్నారు. అందులో వినియోగించేందుకు శానిటరీ న్యాప్ కిన్ మిషన్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్ క్లీన్ చేయడంపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.