ఈ కామర్స్ పుణ్యామా అని బయటకు వెళ్లకుండా అన్ని వస్తువులను ఇంట్లో నుంచి కొనుగోలు చేసే సౌలభ్యం వచ్చింది. ఈ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు అవసరమైన అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటాము. అయితే అప్పుడప్పుడు ఇలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వస్తువుకు బదులు మరొక వస్తువు, ఇతర వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా దారుణం ఏమిటంటే మొబైల్, ల్యాప్ టాప్ లాంటి వస్తువులను బుక్ చేస్తే.. పార్సిల్ లో చిన్నపాటి రాళ్లు, చెక్కలు వచ్చాయన్న వార్తలు చాలా వినే ఉంటాం. తాజాగా ల్యాప్ టాప్ బుక్ చేసుకున్న వ్యక్తికి అలాంటి అనుభవం ఎదురైంది. ల్యాప్ టాప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఆ వ్యక్తి పెద్ద రాయితో పాటు, కొంత ఎలక్ట్రానికి వ్యర్ధాలు ఆ ప్యాకింగ్ లో రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగుళూరు చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు చెందిన చిన్మయ రమణ అనే వ్యక్తి దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో తన స్నేహితుడి కోసం అక్టోబర్ 15న ఓ ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ల్యాప్ టాప్ ఆర్డర్ చేశాడు. తన స్నేహితుడుకి సర్ ఫ్రైజ్ ఇవ్వాలని రమణ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 20న రమణ ఆర్డర్ చేసిన పార్శిల్ వచ్చింది. తీరా పార్సిల్ వచ్చాక తెరచి చూసి ఖంగుతిన్నాడు. అందులో రాయి, ఎలక్ట్రానికి స్క్రాప్ ఉన్నాయి. వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. మొదట సదరు ఈ కామర్స్ సంస్థకు ఫోన్ చేసిన ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు ఆ సంస్థ ఉన్నాధికారులు స్పందించి.. అతడి డబ్బులు తిరిగి ఇచ్చారు. అయితే తనకు పార్శిల్ గా వచ్చిన రాయి, ఎలక్ట్రానికి వస్తువులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయగా వైరల్ మారాయి.
అయితే ఇటీవల కాలంలో ఇటువంటి ఫిర్యాదు కస్టమర్ల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ కామర్స్ సంస్థలు ఓ ఆఫ్షన్ తీసుకొచ్చాయి. అదే ఓపెన్ బాక్స్ డెలివరీ ఆఫ్షన్ తీసుకొచ్చాయి. అది ఏమిటంటే.. కస్టమర్ కోరితే.. ఐటమ్ డెలివరీ చేసే ముందు డెలివరీ బాయ్ ఆ పార్సిల్ ను తెరిచి చూపించాల్సి ఉంటుంది. అయితే కస్టమర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినప్పుడే ఈ ఆఫ్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఘటనలో రమణ అనే కస్టమర్ ఆర్డర్ చేసే సమయంలో ఆ ఆఫ్షన్ ఎంచుకోలేదు. దీంతో పార్సిల్ లో రాయి వచ్చిందన్న సంగతి గమనించిన.. అతడు వెంటనే డెలీవరి బాయ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు.
అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ ఆఫ్షన్ ఎంచుకోనందున డబ్బులు రీఫండ్ చేయడం కుదరదని సదరు వ్యక్తి తేల్చిచెప్పాడు. దీంతో సదరు కస్టమర్ ఈ కామర్స్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అంతే కాక అన్ని ఆధారాలను జత చేస్తూ కంపెనీకి ఈమెయిల్ చేశాడు. కస్టమర్ ఫిర్యాదును, ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన సదరు ఈ కామర్స్ సంస్థ సొమ్మును రిఫండ్ వచ్చింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాయితో వచ్చిన పార్శిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK
— Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022