ఓ ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్తే.. మనం చిన్నగా ఉన్నప్పటి రోజులు. ఆకాశంలో ‘బుర్’ అని సౌండ్ వచ్చిందంటే.. విమానం వెళ్తుంది అని ముందే పసిగట్టి.. తల పైకెత్తి చూసేవాళ్లం. ఇంకొంచెం సౌండ్ ఎక్కువచ్చిందంటే.. రాకెట్.. అబ్బా ఆ ఆనందమే వేరు. అదే హెలికాఫ్టర్ అయితే.. అబ్బా ఎంత కింద వెళ్తుందిరా అనే వాళ్లం. ఇపుడు రోజులు మారిపోయాయి. అరేయ్ విమానం వెళ్తుంది రా అంటే.. నువ్ చూడలేదారా విమానం నేను మొన్న సిటీకి వెళ్ళాను.. చాలా చూశాను అంటున్నారు నేటి పిల్లలు. ఇపుడు ఇవన్నీ ఎందుకంటారా?. కేరళకు చెందిన ఓ బిలియనీర్.. కారు, బస్సు.. కొన్నంత ఈజీగా హెలికాఫ్టర్ కొన్నాడు. ఈరోజుల్లో ఇది మాములేగా అందామా?. అనలేం.. ఎందుకంటే.. దీని విలువ 100 కోట్లు.
కేరళకు చెందిన ‘రవి పిళ్లై’.. ఆర్పి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలలో ఎన్నో వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హోటల్స్, హెల్త్,ఎడ్యుకేషన్, టెలి కమ్యూనికేషన్, రిటైల్… ఇలా అన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఇన్ని వ్యాపారాలు చేసే పిళ్ళై.. యూఏఈ నుంచే అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఈయన 100 కోట్ల విలువైన ఎయిర్బస్ హెచ్- 145 హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఇంత లగ్జరీ చాపర్ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై నిలిచారు. కాగా, హెచ్-145 హెలికాప్టర్ అన్ని అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో పైలెట్తో పాటు ఏడుగురు ప్రయాణించవచ్చు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తు నుంచి కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలదు.
ఇది కూడా చదవండి: బైక్పై సద్గురు.. 30వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎందుకో తెలుసా?మార్చి 20న ఈ హెలిక్యాప్టర్లో.. ఆర్పీ గ్రూప్స్ వైస్ చైర్మన్ తో కలిసి.. కోవలం నుంచి ది రవిజ్ అష్టముడి ఫైవ్స్టార్ హోటల్ వరకు ప్రయాణించారు. 68 ఏళ్ల బిలియనీర్ రవిపిళ్లై సంపద విలువ ప్రస్తుతం $2.5 బిలియన్ డాలర్లు. రవిపిళ్లైకి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.