ఈ మధ్య మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం కొన్ని పరుపుల కంపెనీలు నిద్ర పోటీలు నిర్వహిస్తున్నాయి. తమ కంపెనీ చేసిన పరుపు మీద అయితే హాయిగా నిద్ర పడుతుందని ప్రమోట్ చేసుకుంటున్నాయి. డబ్బులు వస్తాయంటే ఎవరు నిద్రపోకుండా ఉంటారు చెప్పండి. పని చేయాలంటే ఆలోచిస్తారు కానీ నిద్ర పోవడానికి పెద్దగా ఆలోచించరు. అందుకే ఈ నిద్ర పోటీలో పాల్గొనేందుకు ఏకంగా ఐదున్నర లక్షల మంది ముందుకొచ్చారు. అయితే అందరూ అనుకున్నప్పుడు నిద్ర రాదుగా. వారంలో ఆరు రోజులు పని సమయంలో నిద్ర వస్తుంటుంది, సెలవు దినాల్లో, ఆదివారం నాడు మాత్రం నిద్ర పట్టదు. అదే మ్యాజిక్కు. ఇదే చాలా మందిని అవుట్ చేసింది. కానీ ఒక యువతి మాత్రం కంపెనీ పెట్టిన నియమాలని పాటిస్తూ టైటిల్ గెలుచుకుంది.
ఒక పరుపుల కంపెనీ దేశవ్యాప్తంగా బెస్ట్ స్లీప్ ఛాంపియన్ పోటీని నిర్వహించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన త్రిపర్ణ చక్రవర్తి అనే 26 ఏళ్ల యువతి ఛాంపియన్ గా నిలిచింది. దేశంలోనే స్లీప్ ఛాంపియన్ గా నిలిచిన ప్రథమ పౌరురాలిగా ఈ యువతి నిలవడం విశేషం. ఈ పోటీలో గెలవాలంటే 100 రోజుల పాటు డైలీ 9 గంటలు నిద్రపోవాలి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న త్రిపర్ణ.. ఈ పోటీ గురించి తెలుసుకుని నిద్ర పోటీకి అప్లై చేసింది. ఆ సమయంలో ఆమె ఎంబీఏ చదువుతుంది. ఈ పోటీకి తనతో పాటు దాదాపు ఐదున్నర లక్షల మంది అప్లై చేయగా.. వారిలో 15 మంది మాత్రమే ఎంపికయ్యారు. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోవాలని కండిషన్ పెట్టి పరుపు, స్లీప్ ట్రాకర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఇలా కొన్ని దశలు పరీక్షల అనంతరం నలుగురిని ఫైనల్స్ కి సెలెక్ట్ చేశారు. ఆ నలుగురిలో త్రిపర్ణ ఉండడం, ఆమె పోటీలో విజయం సాధించడం జరిగింది. 100కి 95 నిద్ర స్కోర్ చేసి బెస్ట్ స్లీపర్ టైటిల్ గెలుచుకుంది.
26-Year-old Triparna Chakraborty is the country’s first Sleep Champion.#Sleepchampion #achiever #triparna #sleephttps://t.co/XwT77MzjZo
— Femina (@FeminaIndia) September 6, 2022
అయితే ఈ టైటిల్ ఏమీ తనకి ఊరికే రాలేదట. దీని కోసం ఆమె చాలా కష్టపడ్డారట. ఎందుకంటే ఆమె నిద్రపోయింది రాత్రి సమయంలో కాదు, పగటి పూట. ఆమె రాత్రి ఆఫీస్ కి వెళ్తుంది. ఇక ఆమె పగలు మాత్రమే నిద్రపోవాలి. మనందరికీ తెలుసు, పగలు అంతగా ఎవరికీ నిద్రపట్టదని. దానికి తోడు ఇంట్లో శబ్దాలు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఇంట్లోకి వస్తారు. పని వాళ్ళు వస్తారు. డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఈ సమస్యలన్నిటినీ అధిగమించి బెస్ట్ స్లీపర్ గా రూ. 5 లక్షల నగదు గెలుచుకుంది. అదెలా సాధ్యం అంటే ఆమెకి చిన్నప్పటి నుండి నిద్ర వ్యసనం ఉండేదట. కాలేజ్ లో తరచూ పరీక్ష హాలులో కూడా నిద్రపోయేదట ఒకసారి గణిత పరీక్ష రాస్తూ నిద్రపోయి.. 40 నిమిషాల తర్వాత లేచిందట. SAT పరీక్ష రాస్తున్నప్పుడు కూడా ఇదే తీరు. అప్పుడు ఇన్విజిలేటర్ ఆమెను టీ తాగమని పంపాడట. ఈ నిద్ర కారణంగానే ఆమె రోజూ స్కూల్ బాస్ మిస్ అయ్యేదని ఆమె తెలిపింది. చిన్నప్పటి నుండి గాఢ నిద్రలోకి జారుకోవడం, నిద్రపోయే వ్యసనం ఉండేదని, అయితే సమయానికి పనులు చేసేదని ఆమె తల్లి చెప్పారు. మరి నిద్రపోతూ 5 లక్షలు సంపాదించినా ఈ యువతిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.