విశాఖపట్నం- ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ ఈ మోస్తరు వానలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీనికి తోడు అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులు జోరుగా వర్షాలు పడతాని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది.
పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15వ తేదీ లోపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల ఈ నెల 17వ తేదీ వరకు ఉత్తర కోస్తా, తీర ప్రాంత జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావారణ కేంద్రం పేర్కొంది.
అటు ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఉపరితల ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తులు తీసుకోవాలని హెచ్చరించారు.
Intense Lightnings entering #Visakhapatnam city now from North-West, as a precautionary measure, please stay indoors.
Due to Latent Heat, the Thunderstorms will be heavy as it didn’t rained for weeks. Please stay safe. pic.twitter.com/d6EO440cbi
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) August 14, 2021