సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇందులోని ‘కళావతి, మమ.. మహేషా’ సాంగ్స్ హిట్కొట్టాయి. వీటితో పాటు మహేష్ బాబు స్టైల్, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాయి. ‘ ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే ఈ మూవీపై ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Sarkaru Vaari Paata Review: మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ!
ఇదిలా ఉంటే ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఈ సినిమాపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు. అని మహేష్ బాబుని సైతం కొనియాడారు. అయితే తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ‘సర్కారు వారి పాట’మూవీపై విజయసాయి రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.