కొంతమంది నటీనటులు ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కానీ ఆ రోల్, డైలాగ్స్ ద్వారా పాపులర్ అయిపోతుంటారు. అలా తెలుగులో ఒకే ఒక్క మూవీతో సూపర్ ఫేమస్ అయిన ఓ యంగ్ యాక్ట్రెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది నటీనటులు ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కానీ ఆ రోల్, డైలాగ్స్ ద్వారా పాపులర్ అయిపోతుంటారు. అలా తెలుగులో ఒకే ఒక్క మూవీతో సూపర్ ఫేమస్ అయిన ఓ యంగ్ యాక్ట్రెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ల కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచింది ‘పోకిరి’. 2006 సమ్మర్లో వచ్చి ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడమే కాక, ఇండస్ట్రీ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలియానా, ప్రకాష్ రాజ్, నాజర్, అజయ్, బ్రహ్మానందం, ఆలీ, భరత్, ఆశిష్ విద్యార్థి.. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. రిలీజ్ అయ్యి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా ఒక నటి మాత్రం ప్రేక్షకులకు ఇంకా బాగా గుర్తుంది.
ప్రకాష్ రాజ్ ‘గిల్లితే గిల్లించుకోవాలి’ అని చెప్పే డైలాగ్ ఎంత వైరల్ అయిందో చెప్పక్కర్లేదు. విలన్ గ్యాంగ్లో ఓ మెంబర్లా కనిపించింది షీవా రానా. ఆమె అసలు పేరు జ్యోతి రానా. ఈ బాంబే బ్యూటీ ‘పోకిరి’ లో మోనాగా నటించింది. డెన్లో సీరియస్ డిస్కషన్ జరుగుతుండగా మహేష్ బాబుని కొరికేసేలా చూడ్డం, మహేష్ కోసం ఇంటికి వెళ్లి రొమాన్స్ చేస్తుండగా విలన్స్ అటాక్ చేయగా గన్ ఫైర్ చేస్తూ డ్రెస్ చేసుకోవడం.. ఇలా తన లుక్స్, యాటిట్యూడ్తో ఆకట్టుకుంది. బాంబేలో పుట్టి పెరిగిన ఈ భామ అక్కడ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. షీవా యాక్ట్రెస్ మాత్రమే కాదు.. సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ కూడా.
ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఈ బ్యూటీ వర్కౌట్ వీడియోస్, లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొట్టేస్తుంటుంది. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన జ్యోతి రానా కళ్లతోనే కట్టి పడేస్తుంటుంది. ‘గందీబాత్ 3’ సిరీస్లో నటించి ఆకట్టుకుంది. ‘పోకిరి’ తర్వాత చాలా కాలానికి పూరి తనయుడు ఆకాష్ ‘మెహబూబా’ మూవీలో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే ప్రయత్నాలు చేస్తూ.. వచ్చిన ఆఫర్స్ యూజ్ చేసుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది.