Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో తన పెంపుడు కుక్క దిండుల మధ్యలో తల పెట్టుకుని ఉంది. ఆ ఫొటోను సమంత షేర్ చేస్తూ.. ‘‘ తగ్గాను కానీ.. ఓడలేదు’’ అని రాసుకొచ్చారు. సమంత ఆ పోస్ట్ తన అనారోగ్యం గురించే పెట్టిందని నెటిజన్లు భావించారు. ఆ పోస్ట్ పెట్టి 3 రోజులు గడిచింది. ఇక, అప్పటినుంచి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. మూడు రోజుల తర్వాత మంగళవారం ఉదయం సమంత మరో పోస్ట్ పెట్టారు.
బ్లాక్ టీషర్టుతో.. ముఖం సగం మాత్రమే కనిపించేలా ఆమె సెల్ఫీ దిగారు. దాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాదు.. ‘‘ ఒక వేళ నువ్వు ఇది కూడా వినాలనుకుంటే.. నువ్వు ఇంకెప్పుడూ ఒంటరిగా నడవలేవు’’ అని రాసుకొచ్చారు. ఇక, ఆ టీషర్టుపై కూడా ‘‘ నువ్వు ఇంకెప్పుడూ ఒంటరిగా నడవలేవు’’ అన్న పదాలు ఉన్నాయి. మరి, సమంత ఏ ఉద్ధేశ్యంతో ఈ పోస్టు పెట్టిందో తెలియదు కానీ, నెటిజన్లు మాత్రం నానా అర్థాలు తీస్తున్నారు. తన ఆరోగ్యం గురించే చెప్పిందంటూ కొందరు.. లేదు, లేదు తన వైవాహిక జీవితంపై జనం చేస్తున్న వ్యాఖ్యలపై ఈ పోస్ట్ పెట్టిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏదైతేనేం.. సమంత పోస్టు మరోసారి నెట్టింట చర్చకు దారి తీసింది. కాగా, సమంత అనారోగ్యంపై వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్రన్ స్పందించారు అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. సమంత ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడటం లేదన్నారు. చర్మ సంబంధ సమస్య ఉందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక, సమంత నటించిన మశోద, శాకుంతలం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రస్తుతం, విజయ్ దేవరకొండతో సమంత కలిసి నటిస్తున్న ఖుషీ షూటింగ్ జరుపుకుంటోంది.
In case you needed to hear this as well..
YOU’LL NEVER WALK ALONE ♥️ pic.twitter.com/ot0xtkWTVT— Samantha (@Samanthaprabhu2) October 11, 2022